ఓ మహిళ మొబైల్ చార్జర్కు అమర్చిన రహస్య కెమెరాను కనుక్కొంది. అది అక్కడ ఉన్న విద్యార్థినులకు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మునిసిపాలిటీలోని మైత్రి విల్లాస్లో బండారు పరమేశ్వర్ అనే వ్యక్తి మహిళా హాస్టల్ను నడుపుతున్నాడు. ఎవరికీ తెలియకుండా అతడు హాస్టల్లో సీక్రెట్ కెమెరాలను అమర్చాడు. వంటగదితో పాటు.. మరికొన్ని చోట్ల ఈ కెమెరాలను పెట్టాడు. ఎట్టకేలకు విద్యార్థినులు అనేక చోట్ల దాచిన కెమెరాలను కనుగొని పోలీసులను సంప్రదించారు. సమాచారం మేరకు అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ నుండి అనేక గాడ్జెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఛార్జర్ కెమెరాలో అమర్చిన చిప్లను పోలీసులు కనుగొన్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు.. ఇంకా ఏమైనా కెమెరాలను అమర్చాడా అని పోలీసులు తనిఖీ నిర్వహించారు. హాస్టల్ , బాత్రూంలను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వారికి దొరికిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడు ఆ కెమెరాలను అమర్చడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..? ఇప్పటి వరకు ఎవరికైనా ఈ వీడియోలను షేర్ చేశాడా అని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన తర్వాత విద్యార్థినులు తమ సెక్యూరిటీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్లో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
కాగా.. గతంలో కూడా ఇటువంటి ఘటనలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎన్నో వెలుగు చూశాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని మేడ్చల్ లో ఉన్నటువంటి సీఎంఆర్ కాలేజీలో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే కాదు.. ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీక్రెట్ కెమెరాలు కలకలం స్పష్టించాయి. కళాశాల యాజమాన్యాల పర్యవేక్షణ పటిష్టంగా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనల ద్వారా అమాయక మహిళలు ఇబ్బందులకు గురవతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. కొంత మంది ధైర్యంగా పోలీసులకు చెబుతున్నా.. ఇంకొందరు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారినే ఆసరాగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా.. కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని.. మహిళల హాస్టల్స్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa