ఉప-రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆదివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు కుటుంబసభ్యులు తరలించారు. కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఉప-రాష్ట్రపతికి క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగదీప్ దన్ఖడ్కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఆ సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీఎంవో, రాజ్భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పులా పరిస్థితి ఉండేది. ఈ వివాదంతోనే జగదీప్ ధన్ఖడ్ పేరు మీడియాకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa