ఏపీ మంత్రి నారా లోకేష్ 24 గంటల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. తన సొంత డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని నల్లమలలో కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్కు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి.. అధికారులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించే భవనాలను కూల్చివేయకుండా ఉండాల్సిందన్నారు. తాను ప్రభుత్వం తరఫున క్షమాణలు చెబుతున్నానని.. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా తన సొంత నిధులతో త్వరలో అన్నదాన సత్రం మళ్లీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
'విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కాశీ నాయన ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామికి ఇచ్చిన హామీని ఒక్క రోజులోనే అమలు చేశారు. జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్ సర్వీసును పునరుద్ధరించాలని స్వామి కోరగా.. రవాణా శాఖ మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఒక్క రోజులోనే పోరుమామిళ్ల నుంచి జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీ పునరుద్ధరించారు. ఈ బస్సులోనే భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు' అంటూ టీడీపీ తెలిపింది. అలాగే కాశీనాయన క్షేత్రాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ సందర్శించారు. అక్కడ పరిస్థితులపై సమీక్షించగా.. నిర్మాణ పనులను రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పర్యవేక్షిస్తున్నారు.
'మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం24 గంటల్లో కార్యాచరణ బాట కాశీనాయన ఆశ్రమం వద్ద అటవీ అధికారులు కూల్చిన పలు షెడ్లను సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్ 24 గంటల్లోనే పునర్ నిర్మాణం పనులు ప్రారంభించారు. కూల్చిన షెడ్లను తొలగించి నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు' అని టీడీపీ ట్వీట్ చేసింది.
మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల్లోనే కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 'అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహంతో కాశీనాయన జ్యోతి క్షేత్రం ఆశ్రమంలో షెడ్ల కూల్చివేత ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ తప్పును సరిదిద్దే చర్యలు ఆరంభించారు. ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు. అటవీశాఖ అధికారులు చేసిన తప్పిదాన్ని సరిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారని జీరయ్య స్వామి తెలిపారు. షెడ్ల పునర్ నిర్మాణం, ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు, ఇతరత్రా ఏ సహాయం కావాలన్నా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
'కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గంలో వున్న శ్రీ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన సంఘటన గురించి ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్, జరిగిన ఘటన పై పశ్చాత్తాపం వ్యక్తం చేసారు. కూల్చిన షెడ్ల పునర్ నిర్మాణానికి సొంత నిధులిస్తానని, ఆర్టీసీ బస్సు సర్వీస్ కల్పించేందుకు రవాణా శాఖా మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ జీరయ్య స్వామికి హామీ ఇచ్చారు. కాశీ నాయన ఆశ్రమం, జ్యోతి క్షేత్రం నిర్వాహకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని, అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని, సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు' అని టీడీపీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa