ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్యాన్స్ చేయకపోతే సస్పెండ్ చేస్తా..: హోలీ వేడుకల్లో పోలీసుకు ఆర్జేడీ నేత ఆర్డర్

national |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 08:05 PM

ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఇంట్లో హోలీ సంబురాలు నిర్వహించుకుంటుండగా.. ఓ పోలీసు అధికారి బందోబస్తు కోసం అక్కడకు వెళ్లారు. అయితే ఆయన యూనిఫాంలో ఉండగానే తేజ్ ప్రతాప్ సింగ్ ఆయన్ను డ్యాన్స్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు. పాట ప్లే కాగానే డ్యాన్స్ చేయకపోతే.. నిన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజ్ ప్రతాత్ సింగ్ యాదవ్ శనివారం రోజు పాట్నాలోని తన అధికారిక నివాసంలో పార్టీ కార్యకర్తలతో కలిసి హోలీ సంబురాలు చేసుకున్నారు. అయితే ఆ వేడుకల్లో పాల్గొన్న వారంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఫొటోలు దిగారు. ఆపై ఓ చోట కూర్చుని కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈక్రమంలోనే బందోబస్తు కోసం అక్కడకు వచ్చిన ఓ పోలీసు అధికారి కూడా యూనిఫామ్ వేసుకుని నిలబడి ఉన్నారు.


అయితే ఈ విషయం గుర్తించిన ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్.. పోలీసు అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తామని అందుకు నువ్వు నృత్యం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ నువ్వు డ్యాన్స్ చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారి.. తెగ ఇబ్బంది పడిపోతూనే రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.


ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. తండ్రిలాగే కొడుకు ఉన్నాడంటూ చెప్పారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సయమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొడకు అధికారంలో లేకపోయినా.. బెదిరింపులు, ఒత్తిడి ద్వారా చట్టాలను, చట్టాన్ని కాపాడేవారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నృత్యం చేయకపోతే ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తామని బెదిరించడం చాలా దారుణం అంటూ వ్యాఖ్యానించారు.


అలాగే దీనిపై జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ స్పందించారు. బిహార్ ప్రజలు పూర్తిగా మారిపోయాయని.. ఇప్పుడు వారు అందరినీ చూస్తూ ఏది మంచి, ఏది చెడో నిర్ణయించుకుంటున్నారని వివరించారు. తేజస్వీ యాదవ్‌కు అయినా, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అయినా.. తప్పు ఎవరు చేసినా ప్రజలు గుర్తించి వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com