ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేస్తోంది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. ఈ నెల 21న చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఈ నెల 21న తిరుమల పర్యటనకు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు కుటుంబంతో కలిసి ఈ నెల 20 (గురువారం)న తిరుమలకు చేరుకుంటున్నారు.. ఈ నెల 21 (శుక్రవారం) న దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని ముఖ్యమంత్రి కుటుంబం వడ్డించనుంది. ఈ నెల 21వ తేదీ ఒక్కరోజు అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళమిస్తారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా నారా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు మొత్తం అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందజేస్తోంది.
'తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు..ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు కుంభ ప్రదక్షణ, ఉదయం 9.45 నుండి 10.25 గంటల మధ్య వృషభ లగ్నంలో కళావాహనము అక్షతారోహణం మహా సంప్రోక్షణ నిర్వహించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం మార్చి 1 నుండి 3వ తేదీ వరకు ”బాలాలయం” సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు' అని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa