ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ ప్రాంతంలోనే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 05:55 PM

ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి . ఏప్రిల్‌ 2వ తేదీన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారుగా పదివేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరవు పరిస్థితుల కారణంగా స్థానికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే వీరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ చొరవతో రిలయన్స్ సంస్థ ప్రకాశం జిల్లా దివాకరపల్లి సమీపంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఆ తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్లాంట్లను విస్తరిస్తారు. మరోవైపు ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థ రూ.131 కోట్లు ఖర్చుచేస్తోంది. అలాగే బయోగ్యాస్ ఉత్పత్తి కోసం బంజరుభూముల్లో ప్రత్యేకమైన గడ్డిని పెంచనున్నారు. ఇందుకోసం 2000 ఎకరాల భూమి అవసరం. అయితే అధికారులు ఇప్పటికే సర్వే పూర్తి చేసి 12,103 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. వీటిలో ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ వచ్చే నెల రెండో తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa