మైనర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెయిల్ కోసం ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అందులో అత్యాచారాన్ని పరస్పర సమ్మతితో కూడిన బంధంగా అభివర్ణించారు. దీనిపై గురువారం రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం లాయర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగింతే.. పరస్పర బంధం ఎలా అవుతుందని ప్రశ్నించింది. మీ పిటిషన్ చదివాకా మేము మానసికంగా అస్వస్థతకు గురయ్యామంటూ న్యాయమూర్తులు చెప్పగా.. అంతా షాక్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
పిటిషన్ చూసిన వెంటనే.. దాన్ని వేసిన న్యాయవాదిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం న్యాయవాదితో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. మీ పిటిషన్ చదివిన తర్వాత మేము మానసికంగా అస్వస్థతకు గురయ్యామని వివరించింది. అత్యాచారానికి గురైన బాలిక వసయు ఎంత అని అడుగుతూనే.. మీరే పిటిషన్లో బాధితురాలు మైనర్ అని తెలిపారని గుర్తు చేసింది. కానీ ప్రతీ పేరాలో అత్యాచారాన్ని పరస్పర సమ్మతితో బందం అని రాశారని మండిపడింది.
పిటిషన్ మొత్తంలో 20 సార్లు పరస్పర బంధం అని చెప్పారని.. దానికి అర్థం ఏంటో మీరే వివరించాలంటూ ఫైర్ అయింది. అంతటితో ఆగకుండా అసలు మీకు చట్టానికి సంబంధించిన ఓనమాలు అయినా తెలుసా అంటూ ప్రశ్నించింది. మీరు నిజంగానే అడ్వకేట్ ఆన్ రికార్డా (ఏఓఆర్) అని లాయర్ను నిలదీశారు. సుప్రీం కోర్టులో అభ్యర్థనలను దాఖలు చేసే అధికారం కేవలం ఏఓఆర్లకే ఉంటుందన్న న్యాయమూర్తులు.. వీరికి అత్యున్నత న్యాయస్థానమే పరీక్షలు పెడుతుంటుందని గుర్తు చేశారు.
అసలు ఇలాంటి వాళ్లు ఏఓఆర్ లుగా ఎలా అర్హత సాధిస్తున్నారని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అడిగింది. అలాగే భవిష్యత్తులో 8 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగినా.. మీరు సమ్మతితో కూడిన సంబంధమే అనేలా ఉన్నారంటూ పేర్కొంది. మీకు న్యాయ శాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు కూడా తెలియట్లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో చేసేదేమీ లేక సదరు న్యాయవాది ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు. అనంతరం అత్యున్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa