ఢిల్లీ నుంచి లఖ్నవూ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు చనిపోయి కనిపించాడు. విమానం గాల్లో ఉండగానే మృతి చెందగా.. ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. సిబ్బంది సహా పక్కన ఉన్నవారు సైతం కనిపెట్టలేదు. ముఖ్యంగా అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండగా.. విమానం ఆగినా సీటు బెల్టు కూడా తీయలేదు. అయితే విమానం ఆగిన తర్వాత.. దాన్ని క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది వ్యక్తి సీటుపై పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పైఅధికారులకు తెలుపగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలు దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం.. శుక్రవారం రోజు ఉదయం 8.10 గంటలకు లఖ్నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంగా సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంతా విమానం దిగి వెళ్లిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అక్కడే ఉండిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. కానీ విమానాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు. సీట్లను క్లీన్ చేస్తుండగా.. ఓ ప్రయాణికుడు అక్కడే పడుకుని ఉండడాన్ని చూశారు.
ముఖ్యంగా అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండగా.. సీటు బెల్టు కూడా తీసుకోకుండా ఉండిపోయాడు. దీంతో సిబ్బంది ముందుగా అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఎంతకూ పలకకపోయేసరికి అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది అతడిని పరీక్షించారు. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. దీంతో అతడు ఎవరో, అతడి కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు అధికారులు.
ముఖ్యంగా మృతుడు ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించి.. ఆపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన కనిపించిన తీరు చూస్తుంటే.. విమానం గాల్లో ఉండగానే అతడు ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. అది వచ్చాకే ఆయన మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు.
ఎయిర్ ఇండియా విమానంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా.. తాజాగా సిబ్బంది ఓ వ్యక్తి చనిపోయిన విషయాన్ని గుర్తించకపోవడాన్ని హైలెట్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని మరోసారి రుజువు అయిందంటూ చెప్పుకొస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa