ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కర్నూలులో పర్యటనకి బయలుదేరిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 12:38 PM

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో కుడా మాజీ చైర్మన్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు. వైయ‌స్‌ జగన్‌ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో కుడా మాజీ చైర్మన్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ సీఎం పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన తిరిగి 12.50 గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌ పనులను వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్‌లు పరిశీలించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com