ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉర్దూ ఇండియాలోనే పుట్టింది..: సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 08:53 PM

సైన్ బోర్డులపై మరాఠీని మాత్రమే ఉపయోగించాలని.. ఉర్దూను ఉపయోగించడానికి అనుమతించకూడదంటూ దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఉర్దూ కూడా ఇండియాలోనే పుట్టిందని.. దాన్ని ఓ మతానికి, ప్రాంతానికి అంటకట్టడం సరికాదని చెప్పింది. ఈ రెండు భాషలకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉందని గుర్తు చేసింది. ఉర్దూ స్థానిక ప్రజలందరికీ బాగా అర్థం అవుతున్నందును సైన్ బోర్డులపై ఆ భాషను వాడుతున్నట్లు వివరించింది. ఇకపై కూడా ఇదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోనే నేమ్ బోర్డులపై మరాఠీతో పాటు ఉర్దూ భాషను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ.. మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాటూరు మాజీ కౌన్సిలర్ వర్షతాయ్ సంజయ్ బగాడే మున్సిపల్ కౌన్సిల్‌కు వెళ్లారు. అయితే దీన్ని మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్‌లో జరిగే పనులు అన్నీ మరాఠీలోనే నిర్వహించాలని.. ఉర్దూను సైన్ బోర్డుపై ఉపయోగించడానికి అనుమతించకూడదంటూ పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం విచారణ కూడా జరిపి తీర్పునిచ్చింది. కానీ దాంతో సంతృప్తి చెందని వర్షతాయ్ సంజయ్ బగాడే సుప్రీం కోర్టుకు వెళ్లారు.


ఈక్రమంలోనే నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ముఖ్యంగా బాష.. ఒక సమాజానికి, ప్రాంతానికి, ప్రజలకు చెందినదని జస్టిస్ ధులియా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని.. కానీ ఆ భాష ముస్లింలకు సొంతమైందని వివరించారు. హిందువలకు హిందీ భాషను, ముస్లింలకు ఉర్దూ భాషను బ్రిటీష్ పాలకులు అంటగట్టారని గుర్తు చేశారు. అయితే ఉర్దూ బాష గురించి చర్చించే సందర్భం ఇని కాదంటూనే.. హిందీ, ఉర్దూలు కలిసిపోయినట్లు వివరించారు. హిందీ భాష ఎక్కువ శాతం సంస్కృత భాషగా, ఉర్దూ పర్షియన్ భాషగా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు.


ఇలా బ్రిటీష్ పాలకులు భాషలను విభజించగా.. హిందీ హిందువులు, ఉర్దూ ముస్లింల భాషగా ప్రజల్లోకి వెళ్లిందని న్యాయస్థానం తెలిపింది. అలాగే ఉర్దూ భాషకు ఇండియాలో ఆనవాళ్లు ఉన్నాయని, ఒక మతానికి ఈ భాషను ఆపాదించలేమని పేర్కొంది. మరాఠీ, హిందీ భాషల తరహాలోనే ఉర్దూ కూడా ఇండో-ఆర్యన్ భాష అని స్పష్టం చేసింది. ఇక్కడే పుట్టి, ఎంతో మందికి బాగా నచ్చిన ఈ భాష కవుల హృదయాలను సైతం కదిలించిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ స్థానిక ప్రజలకు ఈ భాష బాగా అర్థం అవుతుండడం వల్లే సైన్ బోర్డులపై కొనసాగుతోందని కోర్టు వెల్లడించింది. ఇలా సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వగా అంతా షాక్ అవుతున్నారు. 2022 చట్టం లేదా ఇతర ఏ చట్టంలోని నిబంధనల్లో ఉర్దూ వాడకంపై నిషేధం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నట్లు వివరించింది. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ చేయాల్సిందల్లా సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను రూపొందించడమేనని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa