బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ ఆధ్వర్యంలో బిజెపిలోకి పలువురు చేసారు. శనివారం ఆదోనిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన జిల్లా కో-కన్వీనర్ రమాకాంత్ తో పాటు 250 మంది కి కునిగిరి నీలకంఠ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన రమాకాంత్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దీక్ష ,పట్టుదల చూసి వారికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని మన ఆదోని అభివృద్ధి చెందాలంటే అటువంటి నాయకత్వంలో గల పార్టీ అవసరమని ఆ పార్టీ నుంచి వచ్చిన మచ్చ లేని నాయకుడు, ప్రజల కొరకు పోరాడే నీలకంఠ నాయకత్వం లో పని చేస్తామన్నారు.
కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు 70 సంవత్సరాల పాలనలో ఏ నాయకుడు చేయలేదని మన ఆదోనిలో లో వాటాలని పంచుకొని దౌర్జన్య పూరిత రాజకీయాలు చేసేటువంటి నాయకులకు మనం స్వస్తి పలకేందుకు ఓటు మనకు ఉన్న ఏకైక ఆయుధమని దీనిని సరిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa