ఓటర్ల జాబితా కచ్చితత్వాన్ని మెరుగు పరచడానికి, ఓటర్ల సేవలను క్రమబద్ధీకరించడానికి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) నుంచి మరణాల సమాచారన్ని ఎలక్ర్టానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుుకుంటామని పేర్కొంది. దీని ద్వారా అత్యంత కచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలు ఉంటుందని వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఓటర్ల జాబితా కచ్చితత్వాన్ని మెరుగు పరచడానికి, ఓటర్ల సేవలను క్రమబద్దీకరించడానికి భారత ఎన్నికల కమిషన్ మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించింది. మార్చిలో జరిగిన ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశం తర్వాత.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి సమక్షంలో ఈ సంస్కరణలను ప్రకటించారు. ముఖ్యంగా పత్రికా ప్రకటన ద్వారా గురువారం రోజు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
నమోదిత మరణాలకు సంబంధించి సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓ) సకాలంలో పొందే వీలు ఉంటుంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంత వరకు వేచి చూడకుండా.. ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు వారి గ్రామాల్లోకి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని వల్ల మరణించిన వ్యక్తుల పేర్లను వెంటనే తొలగించడం ద్వారా ఓటర్ల జాబితా యొక్క సమగ్రతను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఎన్నికల నింబధనలు 1960, జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది.
ఇది మాత్రమే కాకుండా ఓటింగ్ అనుభవాన్ని మెరుగు పరచడానికి, కమిషన్ ఓటరు సమాచార చీటీని మరింత ఫ్రెండ్లీగా మార్చడానికి పునఃరూపకల్పన చేసింది. ముఖ్యంగా ఓటరు సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ ను మార్చాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచనున్నట్లు కూడా తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతో పాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలు ఉంటుంది. దీంతోపాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa