భారత్-పాకిస్థాన్ సరిహద్దు అమృత్సర్లో ఉగ్రకుట్ర ప్లాన్ చేశారు. అయితే అదృష్ట వశాత్తు బీఎస్ఎఫ్ బలగాలు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ కుట్ర భగ్నం అయింది. ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తన ఆయుధాలు పట్టుబడ్డాయి. వీటిలో తుపాకులు, గ్రనేడ్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నమై, భారీ ఎత్తున ఆయుధాలు పట్టుబడడంతో కలకలం రేగుతోంది.
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పదే పది నిమిషాల్లో ముస్లిం కాని, కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అతి తక్కువ సమయంలోనే పాతిక మందికిపైగా ప్రాణాలు తీసి, మరెందరినో గాయ పరిచి ఆపై అడువల్లోకి పారిపోయారు. ఇక అప్పటి నుంచి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ముష్కరులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారో క్షణ క్షణం ట్రాక్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు చిక్కినట్లే చిక్కిన ఉగ్రవాదులు తప్పించుకున్నారు.
మరోవైపు పాకిస్థాన్.. సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ వద్దని హెచ్చరించినా వినకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ భారత్ మాత్రం కాల్పులు జరపడం లేదు. ఓవైపు 26 మందిని చంపిన ఉగ్రవాదులను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు పాక్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. సింధు నదీ జాలల ఒప్పందం రద్దు సహా పాక్ పౌరులను వారి దేశాలకు పంపిస్తోంది. అలాగే సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి దాడైనా జరగొచ్చనే ఉద్దేశ్యంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
అయితే ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ బలాగలు ఆపరేషన్ నిర్వహించాయి. దానిలో భాగంగానే ఉగ్రకుట్నను భగ్నం చేశాయి. అక్కడే వీరికి పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు అప్పగించారు. దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహించబోతున్నారు. అయితే బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అత్యంత వేగవంతంగా, సమన్వయంతో వ్యవహరించడం వల్ల ఈ ఉగ్రకుట్ర భగ్నం అయినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa