ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌పై ఇండియా జల యుద్ధం.. నీరు నిలిపివేసిన భారత్

national |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:15 PM

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అమాయకులైన పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రపంచదేశాలన్ని ఖండించాయి. ఇక భారత్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించింది. టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించే దిశగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఉగ్రవాదులకు అడ్డగా మారిన పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఇండియా.


దీనిలో భాగంగా సింధుజలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాక ఆ దేశ పౌరుల వీసాల రద్దు చేసి వారిని ఇండియా నుంచి వెనక్కి పంపించింది. దౌత్య సిబ్బందిని తగ్గించింది. అటారి సరిహద్దు మూసివేసింది. అలానే పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించింది. వ్యాపార ఆంక్షలు విధించడంతో పాటుగా.. దౌత్యపరంగా ప్రపంచ దేశాలు మద్దతు కూడగట్టి పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇండియా.


ఉగ్రదాడికి వ్యతిరేకంగా.. ఇండియా పాకిస్థాన్ మీద జల యుద్ధం ప్రకటించిన సంగతి తెలసిందే. ఇప్పటికే ఆ దేశంతో కుదుర్చుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.ఇక తాజాగా రెండో దశ చర్యలు ప్రారంభించింది. పాక్ వ్యవసాయరంగానికి మూలాధారమైన నదీజలాల ప్రవాహాలను మన దేశం నుంచి పొరుగు దేశం వెళ్లకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అధికారులు..చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహాన్ని కట్టడి చేసే పనులను వేగవంతం చేశారు.


బాగ్లిహార్ డ్యామ్‌ని 2008లో చినాబ్ నదిపై నిర్మించారు. 900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి నిమిత్తం దీన్ని కట్టారు. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించే నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పాక్‌లోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పంటలకు సాగునీరు ఈ నదీ ద్వారానే అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ నీటిని పాకిస్థాన్ వెళ్లకుండా అడ్డుకునే చర్యలు ప్రారంభించింది.


అలానే జీలం నదీ జలాల విషయంలోనూ కేంద్రం చర్యలకు సిద్ధమవుతుంది. ఈ నదిపై ఉన్న కిషన్ గంగా డ్యామ్ నుంచి నీరు పాకిస్థాన్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంనేందుకు ఇండియా సిద్ధమవుతుంది. ఇప్పటికే మన దేశం సింధు నీటి ఒప్పందాన్ని నిలిపివేయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు తాజా చర్యలు మరింత పిచ్చి లేపుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు నిపుణలు.


ఇదిలా ఉండగా.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తానే ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి పాకిస్థాన్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతూనే ఉంది. వరుసగా పదోరోజూ.. సరిహద్దు చెకోపోస్టుల సమీపంలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. నిన్న అర్థరాత్రి సరిహద్దు రేఖ సమీపం కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధర్, నౌషెరా, సుం దుర్భని, అక్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa