ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 ఏళ్లు కడితే చాలు.. జీవితాంతం నెలకు రూ.15 వేలు గ్యారెంటీ

international |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 11:51 PM

అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) చాలా రకాల పాలసీలు అందిస్తోంది. దేశ ప్రజల అవసరాలు, ఆర్థిక స్థోమతకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తోంది. అత్యంత ఆదరణ పొందుతున్న పథకాల్లో జీవన్ ఉత్సవ్ ఒకటి. ఈ ప్లాన్ కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీలో చేరడం ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పాటు పెట్టుబడిలో 10 శాతం వెనక్కి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. జీవితాంతం నగదు ఇస్తూనే ఉంటుంది. నెలకు కనీసం రూ.4 వేలు గ్యారెంటీగా వస్తాయి. అయితే, నెలకు రూ.15 వేలు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


జీవన్ ఉత్సవ్ పాలసీలో 90 రోజుల నుంచి 65 ఏళ్ల వయసులోపు చేరవచ్చు. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. ప్రీమియం చెల్లింపుల టెన్యూర్ 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా సమ్ అష్యూర్డ్‌లో ప్రతి సంవత్సరం 10 శాతం మేర పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం చెల్లిస్తారు. పాలసీదారుడు 100 సంవత్సరాల వయసు వరకు బతికుంటే అప్పటి వరకూ డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్ చెల్లస్తారు.


నెలకు రూ.15 రావాలంటే ఎలా?


ఈ ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు. 5 ఏళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే ప్రతి ఏటా రూ. 1.16 లక్షలు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం పేమెంట్ కాలం పూర్తయ్యాక మరో 5 సంవత్సరాలు వేచి చూడాలి. ఆ తర్వాతి సంవత్సరం నుంచి సమ్ అష్యూర్డ్‌లో ప్రతి సంవత్సరం 10 శాతం చెల్లిస్తారు. అంటే రూ. 5 లక్షలపై 10 శాతం ప్రకారం ఏడాదికి రూ. 50 వేలు వస్తాయి. బతికున్నంత వరకు ఇలా ఏడాదికి రూ.50 వేలు వస్తూనే ఉంటాయి. అంటే నెలకు రూ.4,166 చొప్పున అందుతాయి. అదే మీరు సమ్ అష్యూర్డ్ రూ.18 లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్షా ఎనభై వేలు అందుతాయి. దీని ప్రకారం నెలకు రూ.15 వేలు చేతికి వస్తాయి. ఇలా మీకు 100 సంవత్సరాలు వచ్చే వరకు అందుతాయి.


అయితే ప్రీమియం చెల్లింపు టర్మ్ బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది మారుతుంది. 5 ఏళ్ల టర్మ్ ఎంచుకున్నట్లయితే మరో ఐదేళ్ల వేచుండాలి. 6 ఏళ్ల టర్మ్ ఎంపిక చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ 4 సంవత్సరాలు ఉంటుంది. ఏడేళ్ల టర్మ్ అయితే వెయిటింగ్ పీరియడ్ 3 ఏళ్లు, అదే 8 ఏళ్లు అయితే రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ప్రీమియం టర్మ్ ఉంటే వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లుగానే ఉంటుంది.


రూ.15 లక్షల బీమా కవరేజీ


పాలసీదారు అకాలంగా మరణిస్తే బీమా రూ. 15 లక్షలు పాలసీదారు కుటుంబానికి ఇస్తారు. సహజ మరణానికి మాత్రమే వర్తిస్తుంది. యాక్సిడెంటల్ బెనిఫిట్, డిసేబిలిటీ బెనిఫిట్ కావాలంటే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. యాక్సిడెంటల్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 20 లక్షలు నామినీకి చెల్లిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa