ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొన్ని మార్పులు చేసుకుంటే చాలు, అందమైన ముఖం మీ సొంతం

Life style |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 11:56 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. మచ్చల్లేని అందమైన ముఖంతో పాటు గ్లాసీ స్కిన్ కోసం తాపత్రయపడుతుంటారు. అందుకే చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక కేరింగ్ తీసుకుంటున్నారు. అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ముఖ చర్మం శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. అయితే కాలుష్యం, సూర్యకాంతి, తినే తిండి అలవాట్ల కారణంగా ముఖం ఎఫెక్ట్ అవుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, ముడతలు లేదా ఇతర సమస్యలు ఉండటం సాధారణంగా మారింది.


దీంతో మచ్చల్లేని ముఖం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీదైన క్రీములు, ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్‌మెంట్లు అవసరం లేకుండాన మచ్చల్లేని ముఖాన్ని సాధించవచ్చు. అయితే, ఇందుకోసం మీరు పెద్దగా చేయాల్సిన పనేం లేదు. ఆహారంలో కొన్ని సాధారణ మార్పులు చేస్తే, మీ చర్మ రంగు మారవచ్చు. ఈ మార్పులు చర్మాన్ని అందంగా మారుస్తాయి. ఇంతకీ ఫాలో అవ్వాల్సిన తిండి మార్పులేంటో తెలుసుకుందాం.


పండ్లు, కూరగాయలు


శరీరంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు చర్మానికి తగిన పోషణ ఇస్తాయి. దోసకాయ, క్యారెట్, టమోటా, నారింజ, బొప్పాయి వంటి ఆహారాలు లోపలి నుంచి చర్మానికి తగిన పోషణ ఇస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా కనిపిస్తుంది.


తినే టైమ్ ముఖ్యం


చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వల్ల కడుపుపై ​​ఒత్తిడి పెరుగుతుంది. చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, రాత్రి భోజనం త్వరగా తినడానికి ప్రయత్నించండి. రాత్రి భోజనం తేలికగా ఉండేలా చూసుకోండి. సరైన సమయంలో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే చర్మం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.


తగినంత నీరు


నీరు చర్మానికి సహజ టానిక్‌లా పనిచేస్తుంది. మెరిసే చర్మం కోసం ప్రతి రోజూ కనీసం రోజుకు 8 నుంచి 10 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రంగా, హైడ్రేటెట్‌గా ఉంటుంది. ఇది ముఖం కాంతిని పెంచడమే కాకుండా పొడిబారడం, ముడతలు, మొటిమలు వంటి చర్మ సమస్యల్ని తొలగిస్తుంది. అంతేకాకుండా శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపడంలో నీరు సాయపడతుంది. ప్రతి రోజూ సరైన మోతాదులో నీరు తాగితే ముఖం మెరుస్తూ, మచ్చలు లేకుండా కనిపిస్తుంది.


ఫ్రైడ్, స్పైసీ ఫుడ్‌కి టాటా


ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది వేయించిన, స్పైసీ ఆహారాన్ని తింటున్నారు. అయితే, ఈ ఫుడ్స్ చర్మానికి ఎంత హానికరమో చాలా మందికి తెలియదు. నూనె, వేయించిన ఆహారాలు చర్మంపై మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాల్ని సృష్టిస్తాయి. అందువల్ల, వీలైనంత వరకు వీటిని నివారించాలి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలకు చోటు ఇవ్వాలి. దీంతో, చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.


స్వీట్స్ జోలికి పోకండి


స్వీట్లు, చక్కెర అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. చక్కెర రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో చర్మం మచ్చలు, గీతలు ఏర్పడతాయి. ఇందుకోసం స్వీట్లకు బదులుకు తేనె వంటి సహజ స్వీటెనర్లను వాడండి. ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa