పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు.. అమెరికా మధ్యవర్తిత్వంతో కాస్త తగ్గుముఖం పట్టాయి. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమరణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే, పాక్ కొద్ది గంటల్లోనే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ క్రమంలో గత 24 గంటలుగా పాకిస్థాన్ సైన్యం జరిపిన తీవ్రమైన షెల్లింగ్, డ్రోన్ దాడుల్లో జమ్మూ ప్రాంతంలో భారత సాయుధ బలగాలు తీవ్ర నష్టం చవిచూశాయి. పాక్ సైన్యం కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు, వాయుసేనకు ఒకరు, సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఒక సబ్-ఇన్స్పెక్టర్ వీరమరణం చెందగా, బీఎస్ఎఫ్ యూనిట్కు చెందిన ఇతర ఏడుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం పూంచ్ జిల్లా కృష్ణా ఘాటి సెక్టార్లో సైనిక పోస్ట్ వద్ద ఆర్టిలరీ షెల్ పేలడంతో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
ఆర్ఎస్ పురా సెక్టార్లో రాత్రంతా జరిగిన కాల్పులు, షెల్లింగ్లో జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన రైఫిల్ మాన్ సునీల్ కుమార్ (25) గాయాలపాలై మరణించాడు. ఉధంపూర్లో పోస్టింగ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ దాడిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సర్జెంట్ సురేందర్ కుమార్ మొగా (36) వీరమరణం పొందాడు. ఆయన ఐఏఎఫ్ 36 వింగ్కు చెందిన మెడికల్ అసిస్టెంట్. అంతకు ముందు హర్యానాకు చెందిన లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, ఏపీకి చెందిన అగ్నివీరుడు మురళీ నాయక్ అమరుడయ్యాడు. ఈ సంఘటనలు భారత భద్రతా బలగాలకు సరిహద్దుల్లో ఉన్న ముప్పు, పాకిస్థాన్ ఉల్లంఘనల తీవ్రతను తెలియజేస్తున్నాయి.
జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల సమయంలో 2025 మే 10న బీఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరుడయ్యాడు. ఆయన మరణంపై బీఎస్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ.. ‘ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం..బీఎస్ఎఫ్ సరిహద్దు అవుట్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూ ధైర్యంగా ముందు నుంచి నాయకత్వం వహించాడు.. బీఎస్ఎఫ్ డీజీ అన్ని ర్యాంకుల అధికారులు అతడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి.. వీర జవాన్ గౌరవార్ధం పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమం రేపు పలౌరాలోని ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం జమ్మూలో జరుగుతుంది... ’ అని తెలిపింది. అదే యూనిట్కు చెందిన మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారని, వీరందరిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa