ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన మూడ్రోజులకే వరుడు మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 09:12 PM

ఓ జంట కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.. భర్తతో సంతోషంగా జీవిద్దామనుకుని ఎన్నో కలలు కనింది. కానీ కాళ్ల పారాణి ఆరక ముందే భర్త దూరమై తీరని శోకం మిగిలింది.. వివాహమైన మూడు రోజులకే భర్త దూరంకావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల 8వ తేదీ రాత్రి విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం పాత కొట్నాబిల్లికి చెందిన ఆసరి సీతారావు, పైడితల్లిమ్మల ఏకైన కుమారుడు ఆసరి జగదీశ్‌(24)కు, అదే ఊరికి చెందిన ముసలి మైనేరు కుమార్తె ఉమా(20)తో గిరిజన సంప్రదాయాలతో వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు శుక్రవారం అన్నవరంలో సత్యదేవుని గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు.. ఆ రోజు రాత్రికి ఇంటికి తిరిగి వచ్చారు.


ఈలోపు జగదీశ్ తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు.. శనివారం మధ్యాహ్నం ఐదుగురు స్నేహితులతో కలిసి కొత్త కొట్నాబిల్లి దగ్గరలోని ఒక క్వారీకి వెళ్ళాడు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు.. ఆ తర్వాత జగదీశ్ దుస్తులతోపాటు పెళ్లి సమయంలో అత్తింటి వారు పెట్టిన బంగారం గొలుసు, ఉంగరాలు ఒడ్డున పెట్టి ఈత కొట్టడానికి నీటి గుంటలోకి దిగాడు. క్వారీలో తవ్వకాలు జరపడం వల్ల అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గొయ్యి నిండా నీరు చేరింది. జగదీశ్ ఈతకు దిగిన తరువాత నీటిలో మునిగిపోయాడు. అది గమనించకుండా స్నేహితులు జగదీశ్ ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. వారు అక్కడి నుంచి బయల్దేరి ఇంటికి వచ్చేశారు.


చీకటి పడినా జగదీశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.. ఏం జరిగిందని అతడి స్నేహితుల నుంచి వివరాలు అడిగారు. వారు క్వారీ దగ్గర మద్యం సేవించామని.. జగదీశ్ ముందుగానే వెళ్లిపోయాడని చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు క్వారీ దగ్గరకు వెళ్లి వెతికారు.. కానీ జగదీశ్ ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగాజ. మధ్యాహ్నం క్వారీ గుంటలో జగదీశ్ శవమై తేలాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్వారీ దగ్గరకు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. జగదీశ్ తండ్రి ఆసరి సీతారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి జరిగిన మూడు రోజులకే నవ వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అయితే జగదీశ్ ఈత కొట్టేందుకు దూకినప్పుడు బండరాయి తలకు బలంగా తగలడం.. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో మునిగి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నంలో పోలీస్‌శాఖలో ఆర్ఐ (రిజర్వ్ ఇన్స్‌పెక్టర్) స్వర్ణలత ఘనకార్యం మరోసారి బయటపడింది.. ఆమె వివాదంలో చిక్కుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa