ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశాలో పిడుగుపాటుకు 9 మంది మృతి.. ప్రజల్లో భయాందోళన

national |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 11:18 AM

ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పిడుగులు పడి గత రెండు రోజుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అలాగే, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ వరుస ఘటనలతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa