ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రీశాట్‌-1బీ ఉపగ్రహం ప్రయోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:27 AM

దేశ భద్రత కోసం ఉద్దేశించిన ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్‌ నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 22 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. ఒకటో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. కాగా, రాకెట్‌లో ధ్రవ ఇంధనం, హీలియం, నైట్రోజన్‌ గ్యాస్‌ను నింపే కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. దేశ భద్రత, సైనిక అవసరాల కోసం రీశాట్‌-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కార్టోశాట్‌-1 ఉపగ్రహం లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో తిరుగుతూ చిత్రాలు అందిస్తోంది. అయితే అది రాత్రివేళల్లో ప్రతికూల వాతావరణంలో ఉపయోగపడటం లేదు. తాజాగా పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్‌ ద్వారా ప్రయోగించే ఈవోఎస్‌-09 ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్‌ సింథటిక్స్‌ ఎపర్చర్‌ రాడార్‌ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రెజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలు లభిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa