ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాభివృద్ధికి అండగా నిలవమని ప్రధానిని కోరిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:22 AM

రాష్ట్రాభివృద్ధికి తోడుగా ఉండాలని ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ తన వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా విన్నవించారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేశ్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఢిల్లీలోని మోదీ నివాసానికి వెళ్లిన లోకేశ్‌ కుటుంబం దాదాపు 2 గంటలు ప్రధానితో గడిపింది. మోదీకి లోకేశ్‌ శాలువా కప్పి, తిరుమల శ్రీవారి విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘యువగళం’ కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. లోకేశ్‌ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. మరో పుస్తకంపై మోదీ సంతకం చేసి లోకేశ్‌కు అందించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్‌ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్‌ బుక్‌లో పొందుపరిచారు. తన నివాసంలో బ్రాహ్మణి, దేవాన్ష్‌లకు ప్రధాని మోదీ ఆశీస్సులు అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa