ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తను గొడ్డలితో నరికి, కూతురిని నీటి సంపులో పడేసిన మహిళ.. నాగర్‌కర్నూల్‌లో దారుణం

Crime |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 12:42 PM

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను, కూతురిని హతమార్చిన దారుణ సంఘటన గ్రామస్తులను షాక్‌కు గురిచేసింది.
గ్రామస్థుల వివరాల ప్రకారం, ఎల్లమ్మ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఆరేళ్ల బాలిక నవనీత కనిపించకపోవడంతో ఆమె బాబాయ్ గ్రామంలో వెతకగా, నీటి సంపులో ఆమె మృతదేహం కనిపించింది. బాలికను బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎల్లమ్మను ప్రశ్నించగా, తానే బాలికను నీటి సంపులో పడేసినట్లు ఒప్పుకుంది.
అంతేకాక, ఐదు నెలల క్రితం ఎల్లమ్మ తన భర్తను గొడ్డలితో నరికి చంపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఈ దారుణ హత్యలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa