మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్బయను మించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన కామాంధులు.. చిత్రహింసలకు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఆమె మర్మాంగంలోకి ఐరన్ రాడ్డును చొప్పించి కిరాతకానికి పాల్పడ్డారు. మృగాళ్ల ఘాతుకానికి తీవ్ర రక్తస్రావం అయి బాధితురాలు ప్రాణాలు విడిచింది. సభ్యసమాజాన్ని ఉలికిపడేలా చేసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె సామూహిక అత్యాచారం చేసి. ఆమెను దారుణంగా హింసించారు. ఈ హత్యాచార ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరి పాల్వి, సునీల్ ధుర్వే అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాండ్వా జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం ఒక వివాహం జరిగింది. ఆ పెళ్లికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. బాధితురాలు కూడా తన కుటుంబంతో కలిసి ఆ పెళ్లికి హాజరైంది. వేడుక అనంతరం కొద్ది దూరంలోని పొలాల్లో ఉండే మహిళా బంధువుకు తోడుగా వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెంట నిందితుల్లో ఒకరైన హరి కూడా ఉన్నాడు. ఆ రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆమె ఆ బంధువుల దగ్గరే ఉండిపోయిందని భావించారు. 2012 డిసెంబరు 12న దేశ రాజధాని ఢిల్లీలో కదులుతోన్న బస్సులో నిర్బయపై ఆమె స్నేహితుడు ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఖాండ్వా ఎస్పీ మాట్లాడుతూ.. ‘ఆమె హరి ఇంటికి వెళ్లింది. అక్కడ అతడు, మరో నిందితుడు సునీల్తో కలిసి మద్యం సేవించారు.. ’ అని తెలిపారు. మర్నాడు ఉదయం ఆ ఇంటి వెనుక అపస్మార స్థితిలో తీవ్రరక్తస్రావంతో ఉన్న ఆమెను గుర్తించారని చెప్పారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన కుటుసభ్యులు తీవ్ర రక్తస్రావం జరిగినా ఆసుపత్రికి తరలించలేదు.., మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్య ఆమె చనిపోయింది.. ఆ తర్వాతే 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు’ అని ఎస్పీ రఘువంశి వివరించారు.
పోస్ట్మార్టంలో ఒళ్లుగగ్గుర్పాటుకు గురిచేసే విషయాలు గుర్తించారు. ‘గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆ మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్డు జొప్పించారు... దీనివల్ల అధిక రక్తస్రావం అయి ఆమె చనిపోయింది’ అని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ భాగాల్లో తీవ్రమైన అంతర్గత గాయాలు ఉన్నట్టు నిర్ధారించారు.
కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ‘‘చనిపోయే ముందు కొద్దిగా స్పృహలోకి వచ్చి ఆమె ఒక భయంకరమైన విషయం జరిగింది. నేను బతకను. సునీల్, హరి చేసిన పని ఇది’’ అని చెప్పారు. బాధితురాలి వద్ద రూ.20 వేలు ఉందని, అవి కూడా మాయమైనట్టు కుటుంసభ్యులు తెలిపారు. గోవాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లిన ఆమె కుమారుడు, కుమార్తె ఇటీవల అక్కడ నుంచి వచ్చి ఆమెకు రూ.20,000 నగదు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa