ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ సమష్టి ప్రదర్శన,,,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన 8 మంది ప్లేయర్లు

sports |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 09:00 PM

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్‌ సమష్టి ప్రదర్శనతో వరుసగా విజయాలు సాధిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీమ్‌ మొత్తం రాణిస్తోంది. ఇంతకుముందు ఆర్సీబీ అంటే కేవలం ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినిపించేవి. వారు ఆడితేనే మ్యాచ్‌లు గెలిచేది ఆ జట్టు. వారు విఫలమైతే ఇక అంతే సంగతి.. మ్యాచ్ పోయినట్లే. అందుకే ఆర్సీబీ ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ నుంచి ఆడుతున్నప్పటికీ ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది.


కొన్నేళ్లు పాటు ఆర్సీబీ అంటే కోహ్లీ, డివిలియర్స్, క్రిస్‌ గేల్ ఇంతే. ఆ తర్వాత షేన్ వాట్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్‌ లాంటి ప్లేయర్లు వచ్చినా ఆ జట్టుకు మాత్రం టైటిల్ అందించలేకపోయారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఆ జట్టు ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తున్నారు. గతంలో అయితే విరాట్ కోహ్లీ ఔట్ అయితే.. మ్యాచ్ పోయినట్లే అనే ఆర్సీబీ ఫ్యాన్స్ భావించేవారు. కానీ ఈసారి కథ మారింది. ప్రతిఒక్కరూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఎడిషన్‌లో 9 మ్యాచ్‌లు గెలిచింది. అయితే ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆ జట్టుకు చెందిన 8 మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లుగా ఎంపికయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కో మ్యాచ్‌లో రాణించారు. ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. పంజాబ్ కింగ్స్‌తో ఓ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ జట్టు విజయం కోసం అద్భుత పోరాటం చేసిన ఆర్సీబీ టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది. కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్లు, మరికొన్ని మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, మరికొన్నిసార్లు ఫినిషర్లు ఆ జట్టును గెలిపించారు. రెండు మ్యాచ్‌లను బౌలర్లు గెలిపించారు.


లక్నో సూపర్ జెయింట్స్‌పై 228 రన్స్ ఛేజ్ చేసే సమయంలో విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక.. ఆర్సీబీ వెనకబడి పోయినట్లు కనిపించింది. కానీ జితేశ్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు బాధ్యత తీసుకున్నారు. మ్యాచ్‌ను గెలిపించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అందుకే ఎన్నడూ లేనంత పటిష్టంగా ఈసారి ఆర్సీబీ కనిపిస్తోంది.


ఐపీఎల్‌ 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అర్సీబీ ఆటగాళ్లు వీళ్లే..


కేకేఆర్‌పై - కృనాల్ పాండ్యా


సీఎస్కేపై - రజత్ పాటీదార్‌


ముంబైపై - రజత్ పాటీదార్


రాజస్థాన్ రాయల్స్‌పై - ఫిలిప్ సాల్ట్‌


పంజాబ్ కింగ్స్‌పై- టిమ్ డేవిడ్


పంజాబ్ కింగ్స్‌పై - విరాట్ కోహ్లీ


రాజస్థాన్ రాయల్స్‌పై - జోష్ హేజిల్‌వుడ్‌


ఢిల్లీ క్యాపిటల్స్‌- కృనాల్ పాండ్యా


సీఎస్కేపై- రొమారియో షెఫర్డ్‌


ఎల్‌ఎస్‌జీపై- జితేశ్ శర్మ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa