ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పెన్షన్' కొత్త రూల్.. అలా జరిగితే బెనిఫిట్స్ అన్నీ బంద్

business |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 09:16 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021లో కీలక సవరణలు చేసింది. పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఈ కొత్త రూల్స్ ప్రభావితం చేయనున్నాయి. ఇప్పుడు విధుల నుంచి తొలగించినట్లయితే గతంలో ప్రభుత్వం అందించే పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అసలు ఎందుకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులపై ఎంత ప్రభావం ఉంటుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) సవరణ నిబంధనలు 2025 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలతో ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు సదరు ఉద్యోగి కేవలం పీఎస్‌యూ బెనిఫిట్స్ మాత్రమే కోల్పోడు, ప్రభుత్వ సర్వీసుల్లో పందిన పెన్షన్ బెనిఫిట్స్ సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఈ మేరకు సవరణ రూల్ 37 (29సీ) తీసుకొచ్చింది కేంద్రం. ముఖ్యంగా ఆ విధంగా ఉద్యోగులను తొలగింపులు సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖ సమీక్షకు లోబడి ఉంటాయి. నిర్ణయం తీసుకోవడంలో అదనపు పర్యవేక్షణ, న్యాయాన్ని అందిస్తుంది.


ఇప్పటి వరకు ఒక పబ్లిక్ సెక్టార్ ఉద్యోగిని ఉద్యోగ విలీనం తర్వాత తొలగించినా, సస్పెండ్ చేసినా ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ ద్వారా వచ్చే ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉండేది కాదు. అయితే, తాజాగా చేసిన సవరణ ఆ ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తోంది. అయితే, ఈ కొత్త సవరణ ద్వారా తెచ్చిన నిబంధన అనేది 2003, డిసెంబర్ 31, అంతకు ముందు ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ కొత్త రూల్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారితనం, క్రమ శిక్షణను పెంపొందిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగి ఏ స్థాయిలోనైనా తప్పుగా ప్రవర్తించి, క్రమ శిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే తీవ్రమైన ఆర్థిక నష్టానికి గురి కావాల్సి వస్తుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa