ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకుని మరీ.. కేసులు పెట్టించుకుంటున్నారు

Crime |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:54 PM

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు.. అక్రమంగా ఉంటున్న విదేశీయులను అదుపులోకి తీసుకుని.. వారిని స్వదేశాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులకు కొత్త సమస్య ఎదురయ్యింది. నగరంలో ఉంటున్న నైజీరియన్లను డిపోర్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉందని పోలీసులు అంటున్నారు. వారు నగరంలోనే ఉండటం కోసం వారు చేసే ప్రయత్నాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుందని అంటున్నారు. ఆ వివరాలు..


  హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్లను డిపోర్ట్‌ చేయడం చాలా ఇబ్బందిగా మారిందంటూ నగర సీవీఆనంద్ చేసిన బహిరంగ ప్రకటన సంచలనంగా మారింది. వారు హైదరాబాద్‌లోనే ఉండడానికి చేసే ప్రయత్నాలు చూస్తే పోలీసులకే దిమ్మతిరుగుతుందంట. ఈ నైజీరియన్లు.. హైదరాబాద్ నుంచి వెళ్లకుండా ఉండటం కోసం.. స్థానిక యువతులను వివాహం చేసుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత తాము వివాహం చేసుకున్న వారి చేతనే తమపై వ్యక్తిగత కేసులు పెట్టించుకుని.. అవి మూతబడేవరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని సీవీ ఆనంద్ వెల్లడించాడు. వీరిని ఎలా బయకు పంపాలో అర్థం కావడంలేదన్నారు. వారిపై కేసులు ఉండడంతో డిపొర్టేషన్‌ ప్రక్రియ అంత సులభం కాదన్నారు.


నగరంలో ఎక్కడ డ్రగ్స్‌ ముఠాలు పట్టుబడినా వారి మూలాలు మాత్రం నైజీరియన్‌ల వద్దనే ఉంటున్నాయి. ఈమధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు ఇలాంటి కేసుల్లో సుమారు 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్‌ చేశారు. అయితే ఎండీపీఎస్‌ చట్టాల్లో ఉన్న లోపాల కారణంగా వారికి సులభంగా బెయిల్ లభిస్తుంది. దీంతో ఇజీగా బయటకు వచ్చి.. మళ్లీ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.


ఇలాంటి వారిని నగరంలో ఉంచకుండా నైజీరియాకు డిపోర్ట్‌ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నా.. అప్పటికే వారి మీద నమోదైన కేసుల కారణంగా అది సాధ్యం కావడం లేదంటున్నారు. అయితే ఇప్పటివరకు పోలీసులు 10 మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్‌ నుంచి పంపించేశారు. వీరంతా నగరంలోని గచ్చిబౌలీ, సన్‌సిటీ, మెహదీపట్నం, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు


హైదరాబాద్‌ నగరంలో దాదాపు 2500 మంది నైజీరియన్‌లు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసిందన్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయకుండా వారిని వారి దేశాలకు పంపాలని భాగ్యనగరం పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి పోలీసులే చాలా సందర్భాల్లో వారికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారని.. ఇందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa