ఆరోగ్య చిట్కాలు ఏవైనా సరే. పరగడుపున పాటిస్తే మంచిదని చెబుతుంటారు. షుగర్ తగ్గించుకోవాలన్నా, బీపీ కంట్రోల్ చేయాలన్నా..బరువు తగ్గాలన్నా కొన్ని రకాల చిట్కాలు ఫాలో అవ్వడానికి ఉదయమే మంచి టైమ్. పరగడుపున తీసుకుంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు అందరు ఎక్స్ పర్ట్స్ ఇదే చెబుతారు. అయితే..ఇలా పొద్దున్నే ఇంకేమీ తినక ముందే ఇలాంటి చిట్కాలు పాటించడం మంచిదే. కానీ..పొరపాటున కూడా కొన్ని పదార్థాలు పరగడుపున తీసుకోకూడదని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ దీప్షికా జైన్. ఆ సమయంలో తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు మరి కొన్ని ఇబ్బందులూ తలెత్తుతాయని వివరించారు. ఇంతకీ పరగడుపున అసలు తినకూడని ఆహార పదార్థాలేంటి. ఏవి తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.
రామ్దేవ్ బాబా చెప్పిన అదిరే చిట్కాలు, రెగ్యులర్గా ఫాలో అయితే కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది
విశాఖపట్నం, విజయవాడలో 'తృప్తి క్యాంటీన్'లు.. తక్కువ ధరలకే, మహిళలకు మాత్రమే ఛాన్స్
'నిన్న చెప్పాడు.. నేడు చేశాడు'.. మంత్రి నారా లోకేష్పై ప్రశంసల జల్లు!
పాలు
న్యూట్రిషనిస్ట్ దీప్షికా జైన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పాలు పొరపాటున కూడా పరగడుపున తీసుకోకూడదు. పాలు ఆరోగ్యానికి మంచిదే అయినా పరగడుపున తీసుకుంటే మాత్రం అవే చేటు చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అయితే..అందరికీ ఇలానే జరుగుతుందని కాదు. కాకపోతే అప్పటికే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లు పరగడుపున పాలు తాగడం అవాయిడ్ చేయడమే మంచిది. పాలల్లో లాక్టోస్ ఉంటుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాదు.
పైగా పాలు తాగినప్పుడు కాస్త అసిడిటీ కూడా వచ్చే అవకాశముంటుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇక పాలల్లో ఉండే కాల్షియం ఐరన్ సహా మరి కొన్ని పోషకాలు శరీరానికి అందకుండా చేస్తాయి. పాలల్లో ఉండే షుగర్ వల్ల ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగే ముప్పు ఉంది. ఐబీఎస్ సమస్య ఉన్న వాళ్లైతే అసలు పరగడుపున పాలు తాగకూడదు అని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ దీప్షికా జైన్.
పండ్లు
పండ్లు కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ..వాటిని సరైన సమయంలో తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పరగడుపున పండ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదముంది. ఈ కారణంగా జీర్ణ సమస్యలూ వస్తాయి. అసిడిక్ ఫ్రూట్స్ తో ఈ ఇబ్బంది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ తో పాటు ఛాతిలో మంట, అజీర్తి ఇబ్బంది పెడతాయి. షుగర్, ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు పరగడపున తింటే అవి అరగడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఉదయం పండ్లు మాత్రమే తినడం వల్ల సరైన విధంగా న్యూట్రియెంట్స్ అందవు. వాటితో పాటు మరి కొన్ని పదార్థాలు కూడా తీసుకుంటేనే ఆరోగ్యకరం. షుగర్, గ్యాస్ సమస్యలున్న వాళ్లు పరగడుపున పండ్లు తినడం మానేయడమే మంచిది.
న్యూట్రిషనిస్ట్ చెప్పిన విషయాలు
కాఫీ
ఉదయం లేవగానే కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. ఇంకొంత మంది అయితే బెడ్ కాఫీ తాగేస్తారు. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయడం బెటర్. ఎందుకంటే..ఇలా పరగడుపున కాఫీ తాగడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్. జీర్ణ సమస్యలతో పాటు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశముంది. అంతే కాదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ లోనూ మార్పులు వస్తుంటాయి. కఫైన్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే యాంగ్జిటీ పెరిగే ప్రమాదం ఉంది.
అయితే అందరిలోనూ ఇవే ఇబ్బందులు వస్తాయని నియమం లేదు. కానీ..ఇలా జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే డైజేషన్ సరిగ్గా అవ్వక బాధ పడే వాళ్లకి మాత్రం ఈ అలవాటు ప్రమాదకరం కావచ్చు. కార్టిసాల్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ కారణంగా స్లీపింగ్ ప్యాటర్న్ దెబ్బ తింటుంది.
గోధుమలు, తృణధాన్యాలు
మొక్కజొన్న, ఓట్స్, బార్లీ, క్వినోవా. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. అయితే..వీటిని తినడానికి ఓ టైమ్ అంటూ ఉంటుంది. ఉదయమే పరగడుపున వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశముంటుంది. అంతే కాదు. కొన్ని సార్లు కళ్లు తిరిగి కింద పడిపోవడం, విపరీతమైన నీరసం, ఆకలి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఉండే ఆహార పదార్థాలతో కలిపి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే డైట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓట్స్, బార్లీ,మిలెట్స్ లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరగడుపున తీసుకుంటే అవి సులువుగా అరగవు. రోజంతా ఇబ్బంది పెడతాయి.
ఏం తీసుకుంటే మంచిది
పరగడుపున గోరు వెచ్చని నీళ్లు, నిమ్మరసం, గుడ్లు, గ్రీన్ టీ లాంటివి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటితో పాటు బెర్రీస్, బాదం పప్పు, చియా సీడ్స్ లాంటివి తినొచ్చు. పరగడుపున పుచ్చకాయ తిన్నా మంచిదే. జామకాయలు, డేట్స్ తీసుకోవచ్చు. అయితే..స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa