ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 20 గంటల సమయం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 01:11 PM

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, బయట క్యూ లైన్‌లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్‌లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. 
శుక్రవారం (జూన్ 6, 2025) ఒక్క రోజులోనే 72,174 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, 35,192 మంది భక్తులు కల్యాణకట్ట వద్ద తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.2.88 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
వేసవి సెలవులు, వారాంతాల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగిందని, దీంతో దర్శన సమయం పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. భక్తులు ముందస్తు ప్రణాళికతో, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. 
ఓం నమో వేంకటేశాయ!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa