గతములో ఎన్నడూ జరగని విధంగా సీతానగరం మండలం ఎంతో అభివృద్ధి చేశానని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. శనివారం రాత్రి సీతానగరం మండలంలో కిషోర్ చంద్రదేవ్ పార్వతిపురం నియోజకవర్గ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు తరపున ఎమ్మెల్సీ జగదీష్ బేబినాయనతో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ధర్మం అధర్మం మధ్య పోరాటంగా చెప్పవచ్చని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు అనంతరం బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు ఉండటం దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ కొమ్మినేని కిషోర్ కుమార్ ర్ జెడ్ పి టి సి వెంకట చిన్నప్ప నాయుడు కొల్లి తిరుపతిరావు వేణుగోపాలనాయుడు డు సాల హరి గోపాల్ తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa