ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్.. అప్పుడే వెళ్లుంటే

national |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 07:53 PM

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పంజాబ్ ఇన్‌ఛార్జి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయేత దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈయన మృతి తీవ్ర విషాదాన్ని నింపగా.. ఇప్పుడు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కుమార్తె, భార్యను చూసేందుకు ఆయన లండన్ వెళ్లాలని గతంలోనూ రెండు సార్లు టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ లుథియానా ఉప ఎన్నికల కారణంగా.. తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ముచ్చటగా మూడోసారి టికెట్ బుక్ చేసుకుని విమానం ఎక్కగా.. మధ్యలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. మొదటి రెండు సార్లలో ఏ ఒక్కసారి అయినా.. ఆయన లండన్ వెళ్లుంటే ఈరోజు ప్రాణాలతో బయట పడి ఉండేవారు.


పంజాబ్ బీజేపీ అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉడడంతో.. రాబోయే లుథియానా పశ్చిమ ఉప ఎన్నికలకు కాషాయ దళాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు విజయ్ రూపానీ. ముఖ్యంగా పార్టీ కార్యకలాపాల్లో ఆయన చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఈ రాజకీయ బాధ్యతల కారణంగానే.. ఆయన తన లండన్ పర్యటనను రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా తన కుమార్తె వద్ద ఉన్న భార్యను తీసుకు వచ్చేందుకు అక్కడకు వెళ్లాలనుకున్నప్పటికీ.. లుథియానా ఉప ఎన్నిక కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే ఆయన పాలిట శాపంగా మారింది.


ముఖ్యంగా సంఖ్యాశాస్త్రాన్ని ఎంతగానో విశ్వసించే ఆయన.. తన లక్కీ నెంబర్ అయిన 1206 నాడే ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆయన రెండు సార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం వెలుగులోకి రాగా.. అంతా ఆశ్చర్య పోతున్నారు. కొందరేమో మరణం ఎప్పుడు ఎవరినీ ఎలా తీసుకెళ్తుందో తెలియదని చెబుతున్నారు. ఆయన్ను తీసుకెళ్లేందుకు ఆ భగవంతుడు టికెట్లు క్యాన్సిల్ చేయించి ఉండాలని మరికొంద మంది వివరిస్తునారు. మొదటి రెండు సార్లలో ఎప్పుడు వెళ్లినా ఆయన ఈరోజు ప్రాణాలతో ఉండేవారని పలువురు నెటిజెన్ల కామెంట్లు చేస్తున్నారు.


ముఖ్యంగా విజయ్ రూపానీ మృతితో దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూనే.. ఈ కష్ట కాలంలో వారికి కుటుంబాని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సును ఇప్పటికే అధికారులు గుర్తించారు. సంఘటనా స్థలంలోని బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై ఇది దొరకగా.. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను అధికారులు తెలుసోకనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa