ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ అణు స్థావరాలపై ఓ వైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతిఘటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. చర్చలు, దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
"ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో మాట్లాడాను. పశ్చిమాసిలో నెలకొన్ని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల గురించిమేము వివరంగా చర్చించాము. ఇటీవల జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశాను. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి.. తక్షణం ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యానికి అవకాశం ఇవ్వాలనిృ పిలుపునిచ్చాను." అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు.
థ్యాంక్యూ మోదీ..
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ నుంచి భారత ప్రధాని మోదీకి కాల్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య 45 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీకి వివరంగా తెలిపారు. అనంతరం.. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో భారత్.. ఫ్రెండ్, భాగస్వామిగా పెజెష్కియాన్ అభివర్ణింయారు. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం కోసం భారత్ పిలుపునిచ్చినందుకు ఆయన ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడులో ఆ అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, ఇజ్రాయెల్తో యుద్ధంలో అమెరికా కలగజేసుకోవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఒకవేళ అమెరికా తమ మధ్యలోకి వస్తే కోలుకోలేని డేమేజ్ చేస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా అమెరికా చేసిన దాడులు పశ్చిమాసియాలో పూర్తి స్థాయికి తెరలేపుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్నింగ్లను పట్టించుకోని అమెరికా.. మధ్యలో వచ్చి దాడులు చేసింది. ఈ దాడుల్లో సైనికులు, ప్రజలు కలిపి దాదాపు 865మంది చనిపోయారు.
అయితే, అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు చేపట్టింది. అయితే తమపై దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు తమ దేశంపైకి దూసుకొస్తున్నాయని.. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ చేపట్టిన దాడులతో టెల్ అవీవ్, జెరూసలెం పాటు పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరిక ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa