వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సోమవారం తరలించారు. పాత కేసుల విచారణ నేపథ్యంలో ఉదయం పూట కోర్టుకు హాజరైన తర్వాత వంశీ అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుండటంతో రెండు రోజుల్లో ఆపరేషన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కిడ్నాప్, బెదరింపు కేసులో వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరలు దాడికి పాల్పడ్డారంటూ.. అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సహా మొత్తం 11 కేసులు వంశీపై నమోదయ్యాయి.
అయితే, ఇటీవలే జైలు నుంచి విడుదలైన వంశీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. నిన్న గన్నవరం కోర్టులో హాజరైన వంశీ.. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లారు. వంశీకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ముక్కలో ఓ రంధ్రం పూడిపోయిందని, దాంతోనే శ్వాస తీసుకోలేకపోతున్నారని వైద్యలు నిర్థారించారు. రెండు రోజుల పాటు వంశీని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అనారోగ్య కారణాలతో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ నేరుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరూ కలిసి వంశీ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఫిబ్రవరి 13న అరెస్టయిన వంశీ 137 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. రూ.లక్ష నగదు, ఇద్దరు వ్యక్తుల షూరిటితో పాటు వారానికి రెండుసార్లు పోలీస్ స్టేషన్కు రావాలంటూ కోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa