ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్ల్యూటీసీలో చరిత్రకు 40 రన్స్ దూరంలో రిషభ్ పంత్

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 11:23 PM

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే ఈ సిరీస్‌లో భాగంగా జులై 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో మరో 40 పరుగులు చేస్తే.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా అతడు నిలవనున్నాడు.


రిషభ్ పంత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఇప్పటివరకు 2677 పరుగులు స్కోరు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 2716 పరుగులు చేశాడు. అయితే మాంచెస్టర్ టెస్ట్‌లో రిషభ్ పంత్.. మరో 40 రన్స్ చేస్తే.. రోహిత్ శర్మను అధిగమిస్తాడు. అదే జరిగితే డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసి ప్లేయర్‌గా పంత్.. రికార్డు సృష్టిస్తాడు.


డబ్ల్యూటీసీలో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లు..


రోహిత్ శర్మ - 69 ఇన్నింగ్స్‌లలో 2,716 పరుగులు


రిషభ్ పంత్ - 67 ఇన్నింగ్స్‌లలో 2,677 రన్స్


విరాట్ కోహ్లీ - 79 ఇన్నింగ్స్‌లలో 2,617 పరుగులు


శుభ్‌మన్ గిల్‌ - 65 ఇన్నింగ్స్‌లలో 2,500 రన్స్‌


రవీంద్ర జడేజా - 64 ఇన్నింగ్స్‌లలో 2,212 పరుగులు


కాగా లార్డ్స్ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తూ పంత్ గాయపడ్డాడు. దీంతో మళ్లీ వికెట్ కీపింగ్ చేయలేదు. కానీ బ్యాటింగ్ మాత్రం చేశాడు. మూడో టెస్టుకు నాలుగో టెస్టుకు మధ్య 9 రోజుల విరామం దొరకడంతో పంత్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో పంత్ ఆరు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 425 రన్స్ స్కోరు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. జులై 23 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa