ఫుడ్ అనేది మన బాడీకి ఫ్యూయెల్ వంటిది. దీనిని సరైన విధంగా, తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా సరైన విధంగా తీసుకోకపోతే లేని పోని సమస్యలొస్తాయి. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకోండి.
ఏం తినొద్దు
ఉదయాన్నే తీసుకునే కొన్ని ఫుడ్స్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రంతా మనం ఏం తినకుండా ఉంటాం. తర్వాత సరైన ఫుడ్స్ తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా అసిడిటీని పెంచే ఫుడ్స్ తీసుకుంటే కడుపులోని లైనింగ్ ఇబ్బంది పడుతుంది. ఖాళీ కడుపుతో ఆ ఫుడ్స్ని తీసుకోవడం వల్ల అసిడిటీ పెరుగుతుంది. అందుకే, కొన్ని ఫుడ్స్ని మొత్తానికే అవాయిడ్ చేయాలి. అవేంటంటే
కాఫీ
కాఫీ.. చాలా మంది ఫేవరేట్ డ్రింక్. ఉదయాన్నే కప్పు కాఫీతోనే వారి డే స్టార్ట్ అవుతుంది. గుక్కెడు కాఫీ పడితే వారు ఎక్కడలేని ఎనర్జీతో ఫీల్ అయి వర్క్ చేసుకుంటారు. కానీ, దీనిని ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ పెరుగుతుంది. దీని వల్ల కడుపులోని లైనింగ్ దెబ్బతినడం, గుండెలో మంట, బ్లోటింగ్ వంటి సమస్యలొస్తాయి. అందుకే, కాఫీని ఎంత వీలైతే అంత తగ్గించాలి. కొంతమందికి పాలు, పాలతో తయారైన పదార్థాలు కూడా జీర్ణమవ్వవు. కాబట్టి, వీటిని ఉదయాన్నే పరగడపున తీసుకోవడం మానేయాలి.
పెయిన్ కిల్లర్స్
చాలా మంది మెడిసిన్ తీసుకుంటారు. ఇందులో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ సరైన విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ని సరైన విధంగా తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలొస్తాయి. పరగడపున పెయిన్ కిల్లర్స్ని తీసుకుంటే ముఖ్యంగా ఎక్కువ రోజులు ఇలానే కొనసాగితే గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇతర సమస్యలొస్తాయి. దీని వల్ల కడుపునొప్పి, ఇతర సమస్యలొస్తాయి.
ఆల్కహాల్
కొంతమంది ఏదైనా ఫంక్షన్స్, ఇతర అకేషన్స్, లేదా వీకెండ్ టైమ్లో ఆల్కహాల్ ఉదయాన్నే తీసుకుంటారు. పరగడపున ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపులో మంట, డీహైడ్రేషన్, ఇతర సమస్యలొస్తాయి. ఇవి ఉదయాన్నే తాగడం అస్సలు మంచిది కాదు. ఈ అలవాటుని దూరం చేసుకోవాలి. దీంతో పాటు కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా అసలే వద్దు. దీంతో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలొస్తాయి. అందుకే, వీటికి దూరంగా ఉండండి.
పచ్చి కూరగాయలు, సలాడ్స్
లాడ్స్, పచ్చి కూరగాయలు రెండూ మంచివే. కానీ, ఉదయాన్నే వాటిని తినడం మంచిది కాదు. వీటి వల్ల జీర్ణ సమస్యలొస్తాయి. అందుకే, ఉదయాన్నే వీటిని తీసుకునే బదులు ఏమైనా తిని ఆ తర్వాత సలాడ్స్, కూరగయాలు తీసుకోవడం మంచిది. వీటితో పాటు సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దు. వీటి వల్ల కూడా ఇరిటేషన్, కడుపులో మంట మొదలవుతుంది.
స్పైసీ, షుగరీ ఫుడ్స్
ఉదయాన్నే మంచి మసాలా, ఘాటుగా ఉండే ఫుడ్స్ తింటే కడుపులో మంట లేవడం ఖాయం. దీని వల్ల జీర్ణ సమస్యలొస్తాయి. ఇక షుగర్ ఫుడ్స్ తీసుకుంటే అందులోని పంచదార కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల సమస్యలొస్తాయి.
ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్
నూనెలో ఎక్కువగా ఫ్రై చేసిన అన్హెల్దీ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి మంచివి కాదు. వీటి వల్ల జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫీషియల్ పదార్థాలు ఉంటాయి. వీటిని అరిగించుకోవడం కష్టం. కాబట్టి, ఉదయాన్నే వీటిని తీసుకోవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa