ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబరులో మరో ఆలయంలో తొక్కిసలాట? ఘోర రైలు ప్రమాదం?.. భయపెడుతోన్న జ్యోతిషుడు అంచనాలు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 08:08 PM

విమాన ప్రమాదం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట వంటి ఘటనలు దేశాన్ని తీవ్రంగా కలిచివేశాయి. ఈ ఏడాది మరో ఐదు నెలలు మిగిలి ఉండగా.. ప్రఖ్యాత జ్యోతిషుడు సంజీవ్ మాలిక్ జోస్యం ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఆయన అంచనాలు నిజం కావడంతో వచ్చే ఐదు నెలల్లో మరిన్ని విపత్తులను దేశం ఎదుర్కొబోతుందా? అనే భయాలు వెంటాడుతున్నాయి.


సూపర్‌టాక్స్ అనే పోడ్‌కాస్ట్‌లో సంజీవ్ మాలిక్ మాట్లాడుతూ, 2025 చివరిలో దేశాన్ని తీవ్ర విషాదాలు వెంటాడతాయని అన్నారు. ‘వచ్చే నవంబరులో ఒక దేవాలయంలో తొక్కిసలాట చోటుచేసుకోబోతుంది’ అని సంజీవ్ మాలిక్ అన్నారు. దక్షిణ భారతదేశం గురించి హోస్ట్ ప్రశ్నించగా.. ‘ఫలానా ప్రదేశం చెప్పలేను కానీ ఉత్తర భారతంలో, ముఖ్యంగా మథురలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’ అని జోస్యం చెప్పారు.


జులై 27న హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో ఇప్పటికే తొక్కిసలాట జరిగింది. దీనిపై గతంలో మాలిక్ చెప్పిన అంచనాల గురించి సామాజిక మాధ్యమాల్లో కొందరు విమర్శిస్తే.. ఇంకొందరు ప్రశంసిస్తున్నారు. (ఈసారి వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపుతాయని, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఘోరమైన విపత్తులు సంభవించొచ్చని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో కన్వర్ యాత్రికులు బస్సు లోయపడిన ఘటనను ఆయన ఉదాహరణగా చూపిస్తూ.. ‘2025 రెండో భాగంలో పర్వత ప్రాంతాలకు ప్రయాణాలు చెయెద్దు’ అని సూచించారు.


అక్టోబరులో భారీ రైలు ప్రమాదం?


మాలిక్ జ్యోతిష అంచనాల ప్రకారం ‘‘అక్టోబరులో భారత్‌లో మరో భారీ రైలు ప్రమాదం’ సంభవించే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా తమిళనాడులో ఇది జరగవచ్చని, పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగొచ్చని ఆయన అంచనా వేశారు.


డిసెంబరులో షేర్ మార్కెట్ పతనం?


ఆర్థిక రంగానికి సంబంధించి కూడా ఆయన అంచనాలు వెలువరించారు. ‘‘డిసెంబరు 2025 నాటికి భారత షేర్ మార్కెట్‌లో భారీ పతనం సంభవించే అవకాశం ఉంది.. ఆర్ధిక రంగాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.


అయితే, ఈ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు మాలిక్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇంత స్పష్టంగా అంచనా వేసే మీరు.. వీటిని నివారించడానికి ప్రభుత్వంతో ఎందుకు కలిసి పనిచేయరు? భయపెట్టే జోస్యాలు చెప్పడం మానేసి ప్రజలను రక్షించే మార్గాలు చెప్పిండి’ అని మండిపడుతున్నారు. కొందరు మాత్రం ఆయన అంచనాలను నిజమవుతాయని ప్రశంసిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa