ప్రపంచ ఛాంపియన్షిప్ లెజెండ్స్ (World Championship of Legends 2025) టోర్నీ నుంచి భారత జట్టు అధికారికంగా వైదొలిగింది. ఈ టోర్నీలో భాగంగా జూలై 31న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత్ vs పాకిస్థాన్ మధ్య సెమీ ఫైనల్ జరగాల్సి ఉంది.అయితే, ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఫలితంగా, భారత్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో పాకిస్థాన్ జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. లీగ్ దశలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకూ ఒక్కో పాయింట్ కేటాయించారు.యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు, వెస్టిండీస్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకొని సెమీ ఫైనల్కు ప్రవేశించింది. ఇక మరో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆగస్టు 2న ఫైనల్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది.ఈ నేపథ్యంలో, భారత్–పాకిస్థాన్ సెమీస్కు సంబంధించిన స్పాన్సర్షిప్ నుంచి వెనకడుగేయడం వలన మరింత దృష్టి ఆకర్షించింది. ఈ విషయాన్ని టోర్నీ స్పాన్సర్ ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa