ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకులతో బెదిరించి పింఛన్ల సొమ్ము అపహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 08:13 PM

పింఛన్ల నగదు తీసుకెళ్తున్న సచివాలయ ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి సొమ్ము దోపిడీ చేశారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలోని రాయిపల్లి సమీపంలోని వంతెన వద్ద గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెదబయలు మండలం బొండాపల్లి పంచాయతీలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మత్స్యబాబు పింఛన్ల బట్వాడా నిమ్తితం గురువారం భారతీయ స్టేట్‌బ్యాంకులో రూ. 15.62 లక్షల నగదు తీసుకున్నారు. చెరువుపాకల గ్రామంలోని తన ఇంటికి వెళ్తుండగా రాయిపల్లి వద్ద గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తుపాకులు, కత్తులు చూపి, నగదు లాక్కున్నారు. దుండగులు వారు వచ్చిన స్కూటీపైనే అక్కడి నుంచి పరారయ్యారు. మత్స్యబాబు సాహసించి ఆ మార్గంలో ద్విచక్రవాహనంపై వస్తున్న మరో వ్యక్తి సహాయంతో దుండగులను వెంబడించారు. పెదబయలు మీదుగా ఒడిశా వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఒడిశాలోని బయలుగుడ సమీపంలో.. దుండగుల స్కూటీ పొలాల్లోకి దూసుకుపోయింది. దుండగులు వాహనాన్ని పొలాల్లో వదిలేసి పారిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa