ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూనియర్ ఎన్‌టీఆర్‌ను నేను తిట్టలేదు: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 05:27 PM

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పైగా దీనికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను వార్ 2 ప్రత్యేక షోకు ఆహ్వానించారని.. ఆ సమయంలో సదరు ఎమ్యెల్యే ఎన్టీఆర్‌ని అసభ్య పదజాలంతో దూషించాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై జూనియర్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పదించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు.


జూనియర్ ఎన్టీఆర్‌పై తాను అసభ్యకర వ్యాఖ్యాలు చేశానంటూ.. అందుకు సంబంధించిన ఆడియో అంటూ ఏదో ప్రచారం జరుగుతుందని.. అది పూర్తిగా నకిలీదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. తనను కించపరిచే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఇలా ఫేక్ ఆడియోలు క్రియేట్ చేసి.. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను ఎన్టీఆర్‌ను తిట్టలేదని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు నారా, నందమూరి కుటుంబాలంటే ఎంతో అభిమానం. జూనియర్ ఎన్టీఆర్‌ను నేను చాలా గౌరవిస్తాను. అలాంటిది నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఏంటి. ఈ విషయంలో ఆయన అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి’ అని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేస్తోన్న నకిలీ వీడియోలు, ఆడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.


ఇదిలా ఉంచితే నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక ఆడియ తెగ హల్చల్ చేసింది. దీనిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ‌ను అసభ్య పదజాలంతో దూషించినట్లుగా ఉంది. ఆయన సినిమా ప్రదర్శిస్తే.. తగలబెడతానని బెదిరించినట్లుగా ఆడియోలో ఉంది. ఇది కాస్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. అయితే ఆ ఆడియోలన్నీ తప్పుగా క్రియేట్ చేసినవి అని.. వీటి ద్వారా తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రజలు ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.


ఎన్టీటీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తోన్న ఆడియో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ఉద్రిక్తత సృష్టించారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు.. దగ్గుపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకుని అభిమానులను అడ్డుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa