ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించకూడదని, అతడిని టెస్ట్ క్రికెట్కు పరిమితం చేయాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్తో పాటు, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సిఫార్సు చేశారు.గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పైనే టీమిండియా దృష్టి పెట్టాలి. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా తన పని భారం నియంత్రణలో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇది అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో అతని పాల్గొనడం పై సందేహాలు తలెత్తుతున్నాయి.టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరగనుంది. భారత్, సెప్టెంబర్ 10న యూఏఈతో మ్యాచ్తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో హైఓల్టేజ్ మ్యాచ్ కూడా ఉన్నది. దీంతో బుమ్రా ఎంపికపై క్రికెట్ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పష్టంగా పేర్కొంటూ, "బుమ్రాను పరిమిత ఓవర్లకు కాకుండా, టెస్ట్ క్రికెట్కే కేటాయించాలి. ఇంగ్లండ్ పర్యటనలో అతను ముందుగానే సెలెక్షన్ కమిటీకి తన పరిమితి గురించి చెప్పాడు. అందువల్ల అతను మూడు మ్యాచ్లకే ఆడాడు" అని చెప్పారు.భారత్ అక్టోబర్లో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్, ఆపై సౌతాఫ్రికాతో మరో సిరీస్ ఆడనుంది. ఈ రెండింటి మధ్య చిన్న విరామమే ఉన్నా, బుమ్రా పునరుత్తేజంతో మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది.గవాస్కర్ సూచన ప్రకారం, "బుమ్రా వంటి కీలక బౌలర్ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లక్ష్యంగా వినియోగించాలి. ద్వైపాక్షిక టూర్ల కన్నా, మెజర్ టెస్ట్ సిరీస్లకే అతని సేవలు అందుబాటులో ఉంచాలి. కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో స్పష్టత తీసుకురావాలి" అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa