ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్లోని కోటా-బుందీ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1507 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించనున్నారు. చంబల్ నది ఒడ్డున ఉన్న కోటా నగరం రాజస్థాన్ పారిశ్రామిక రాజధానిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, దేశంలోనే నీట్, ఐఐటీ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రధాన శిక్షణ కేంద్రం కూడా.
అలాగే, చెన్నై- కోల్కతా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కటక్-భువనేశ్వర్ మధ్య ఆరు వరుసల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్రవేసింది. మొత్తం రూ.8307 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గతవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఒడిశాలో సెమీ-కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో సెమీ-కండక్టర్ల యూనిట్ల ఏర్పాటుకోసం మొత్తం రూ.4,594 కోట్లను కేంద్రం కేటాయించింది.
మొత్తం 110 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ .. ఖుర్దా, భువనేశ్వర్, కటక్- ధమనిలను కలపుతుంది. ఈ పట్టణాలకు ప్రస్తుతం ఉన్న రహదారిపై ప్రయాణానికి 2.30 గంటలు సమయం పడుతుంది. అదే రింగ్ పూర్తయితే కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఇక, చెన్నై-కోల్కతా 16వ నెంబరు జాతీయ రహదారి ఒడిశాలోని పలు పట్టణాల గుండా వెళ్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో హైవేను విస్తరించడం ఆచరణసాధ్యం కాదని అదికారులు చెబుతున్నారు. భువనేశ్వర్లో కార్లు లక్ష దాటేశాయని, రద్దీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుని ట్రాఫిక్ తగ్గించడం, ప్రాంత అభివృద్ధి కోసం రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు అనివార్యమని అధికారులు స్పష్టంచేశారు. పీక్ టైమ్లో ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తే 2.30 గంటల సమయం పడుతోంది. 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ చేసిన రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం ఏకంగా ఒక గంట 20 నిమిషాలు తగ్గిపోతుంది. దీంతో ఖుర్దా, భువనేశ్వర్, కటక్ వెలుపల పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
కేంద్ర విధానాల ప్రకారం.. బైపాస్ నిర్మాణానికి భూమి ఖర్చులో 50 శాతం ఒడిశా ప్రభుత్వం భరించనుంది. దీని వ్యయం రూ.1,025 కోట్లుగా అంచనా. ఈ ప్రాజెక్ట్ను మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపడతారు. మొత్తం కారిడార్లో ఆరు ఇంటర్ఛేంజ్లు, నాలుగు ఎలివేటెడ్ స్ట్రెచ్లు, ఐదు పెద్ద, 44 చిన్న వంతెనలు, మూడు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, 17 వాహనాల అండర్పాస్లు రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa