ఆయుర్వేదంలో మూలికలు ఎంత ముఖ్యమ మసాజ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మూలికలు అయితే సమస్యని తగ్గిస్తాయి. అలానే మసాజ్ కూడా కొన్ని సమస్యలకి పరిష్కారంగా ఉంటాయి. అందులోనే ఓ మసాజ్ గురించి చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా. తిన్న వెంటనే కొంతమందికి అసిడిటీగా అనిపించి ఆహారం జీర్ణమవ్వదు. పైగా కడుపు మొత్తం ఉబ్బినట్లుగా ఉంటుంది. దీంతో చాలా మంది ఆహారం తినాలంటేనే భయపడతారు. సమస్య ఎక్కువగా ఉంటే మందులు వేసుకుంటారు. కానీ, కొంతమంది జీలకర్ర నీరు తాగడం వంటి ఇంటి చిట్కాలని ఫాలో అవుతారు. ఇవి కూడా సమస్యని తగ్గించినప్పటికీ జీలకర్ర నీరు తాగడం వంటివి ఇష్టం లేని వారు ఆయుర్వేద పద్ధతిలో మసాజ్ కూడా జీర్ణ సమస్యలు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. అదికూడా ఆయుర్వేద పద్ధతిలో అది కూడా సమస్యని చాలా వరకూ తగ్గిస్తుంది. ఆ మసాజ్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
2 టేబుల్ స్పూన్ల సోంపు
2 టేబుల్ స్పూన్ల జీలకర్ర
అల్లం పొడి 1 టీస్పూన్
1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు(ఆప్షనల్)
ఏం చేయాలి?
ఓ పాన్పెట్టి వేడయ్యాక ఒక్క పదార్థం వేసి 2 నుంచి 3 నిమిషాలు దోరగా డ్రై రోస్ట్ చేయాలి.
వీటన్నింటిని ఓ కాటన్ క్లాత్లో వేసి మూటలా కట్టాలి.
వేడి మరీ ఎక్కువగా ఉండకుండా తక్కువగా ఉండకుండా మన చర్మం భరించేంత ఉంటే దాంతో నాభి చుట్టూ మసాజ్ చేయాలి. 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేయండి.
ఇది భోజనం చేశాక వచ్చే అసిడిటీ, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
పీరియడ్స్ పెయిన్
ఇది కేవలం తిన్న తర్వాత వచ్చే ఉబ్బరం, కడుపునొప్పిని మాత్రమే కాదు. ఆడవారిలో పీరియడ్స్ టైమ్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఆ టైమ్లో కూడా ఎక్కువగా జీర్ణ సమస్యలు, బ్లోటింగ్ వంటివి ఉంటాయి. కొంతమందికి పీరియడ్స్కి ముందే ప్రీ మెనుస్ట్రువల్ సింప్టమ్స్ ఉంటాయి. అలాంటి టైమ్లో కూడా కడుపునొప్పి, జీర్ణ సమస్యల వంటివి ఉంటాయి. వాటిని దూరం చేయడంలో కూడా ఈ మసాజ్ హెల్ప్ చేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
ఇందులో వాడిన జీలకర్ర, వాము, సోంపు వంటి పదార్థాలన్నీ గ్యాస్ని తగ్గించి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా, ఇందులోని డ్రై జింజర్ ఇన్ఫ్లమేషన్, అసిడిటీని తగ్గిస్తుంది.
ఇక మనం వీటిని వేడి చేసి పొట్టపై ఉంచుతాం కాబట్టి, ఆ వేడి హీట్ థెరపీలా పని చేసి జీర్ణాగ్నిని పెంచుతుంది. దీంతో బ్లోటింగ్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది.
అసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే టిప్స్
ఆహారపు అలవాట్లు
అదే విధంగా, తినగానే కడుపు ఉబ్బరానికి చాలానే కారణాలు ఉంటాయి. కొంతమంది సరిగ్గా తినరు. తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం, నీరు తాగడం వంటి వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అలా చేయకూడదు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినకుండా తక్కువతక్కువగా తినాలి.
నీరు ఎక్కువగా తాగాలి. భోజనం ముందు కానీ, తర్వాత కానీ తాగాలి.
నిద్ర ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
తిన్న తర్వాత అలానే కూర్చోకుండా కాస్తా అటు ఇటూ తిరగడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa