రైలు అనేది సగటు మధ్య తరగతి జీవికి నేల విమానం లాంటిది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే వెంటనే గుర్తొచ్చేది రైలే. సౌకర్యవంతంగా, అందుబాటు ధరలో ప్రయాణించే వీలు ఉండటంతో ఎక్కువ మంది రైలు ప్రయాణాలకు మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ కారణంతోనే పండుగ వేళల్లో రైళ్లల్లో భారీగా రద్దీ నెలకొంటూ ఉంటోంది. మరోవైపు రైలు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా, పెరుగుతున్న రద్దీకి తగినట్లుగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ కొత్తగా అధునాతన కోచ్లను రైళ్లకు అమర్చుతోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీలోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటుగా.. నగరాల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లల్లోనూ LHB బోగీలను అందుబాటులోకి తెచ్చింది. LHB బోగీల ఏర్పాటుతో ప్రయాణికులు కుదుపులు లేకుండా ప్రయాణించవచ్చని అధికారులు చెప్తున్నారు. సాధారణ ICF బోగీలతో పోలిస్తే, LHB బోగీలలో బెర్తులు విశాలంగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే ప్రమాదాలు జరిగితే నష్ట తీవ్రతను తగ్గిస్తాయని వివరిస్తున్నారు. .
LHB బోగీలను జర్మన్ టెక్నాలజీతో రూపొందించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అత్యాధునిక బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ డివిజన్కు ఈ LHB బోగీలను కేటాయించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి నడిచే ఇంటర్ సిటీ రైళ్లతో పాటుగా విశాఖపట్నం, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, షిరిడీ వంటి ప్రాంతాలకు నడిచే రైళ్లకు వీటిని జత చేశారు. LHB బోగీల లోపల సీట్లు విశాలంగా ఉంటాయని.. సీటింగ్ వ్యవస్థ కూడా సౌకర్యవంతంగా ఉందని ప్రయాణికులు చెప్తున్నారు. అన్ని రైళ్లకు కూడ ఇలాంటి బోగీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి నడిచే అన్ని రైళ్లకు దశలవారీగా వీటిని అమర్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa