ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు పన్నులు చెల్లింపులు.. ఈ డబ్బులన్నీ పారదర్శకంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే స్వర్ణ పంచాయతీ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు. ఈ నెల నుంచి రాష్ట్రంలో పూర్తిగా స్వర్ణ పంచాయతీ సాఫ్ట్వేర్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. గతంలో పన్నుల చెల్లింపులు సరిగా లేకపోవడం, లెక్కలు సక్రమంగా లేకపోవడంతో అక్రమాలు జరిగేవి. అందుకే ఏపీ ప్రభుత్వం "స్వర్ణ పంచాయతీ" విధానాన్ని తీసుకువచ్చింది. పన్నుల వసూళ్లు, ఖర్చుల్లో పారదర్శక కోసం తీసుకొచ్చారు.
రాష్ట్రంలో దాదాపు 13,344 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో ఇళ్ల పన్నులు, నీటి పన్నులు సరిగా వసూలు చేసేవారు కాదు. ప్రజలు కట్టిన పన్నులకు సరైన రికార్డులు ఉండేవి కావు. దీనివల్ల చాలా అవినీతి జరిగేది.. ఇప్పుడు ఈ విధానం ద్వారా జమాఖర్చుల్లో తప్పులు జరగకుండా, నిధుల దోపిడీ జరగకుండా అడ్డుకోవచ్చు అంటున్నారు. స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ప్రజలు పన్నులు డిజిటల్గా చెల్లించవచ్చు. నగదు అవసరం లేదు.. డబ్బులు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ అవుతుంది. ఈ డబ్బును గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగించొచ్చు. ఎంత ఖర్చు చేశారో కూడా నమోదు చేస్తారు. దీనివల్ల పంచాయతీలకు వచ్చే డబ్బు, ఖర్చుల వివరాలు పారదర్శకంగా ఉంటాయి. ప్రజలు ఇంటి నుంచే పన్నులు చెల్లించవచ్చు. ఈ టెక్నాలజీతో పంచాయతీల ఆదాయం పెరిగిందంటున్నారు.
పంచాయతీలకు వచ్చే ఆ డబ్బును గ్రామంలోని రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తుంది. ఏ పనికి ఎంత ఖర్చు చేశారో యాప్లో నమోదు చేస్తారు. దీనివల్ల ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ప్రజలు తమ ఇంటి పన్ను ఎంత చెల్లించాలి? బకాయిలు ఉన్నాయా? తాము కట్టిన పన్ను ప్రభుత్వ ఖాతాకు చేరిందా లేదా? అనే విషయాలను స్వర్ణ పంచాయతీ యాప్లో చూడవచ్చు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ మరియు యాప్ పనితీరును పరిశీలించారు. ఈ యాప్ వల్ల పంచాయతీలకు, ప్రజలకు ఇద్దరికీ లాభం అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa