హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయాల్లో పూరీ జగన్నాథ ఆలయం ముందు వరుసలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. దేశంలో మరే ఆలయానికి లేని పలు ప్రత్యేకతలు పూరీ ఆలయానికి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది పూరీ జగన్నాథ ఆలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయ గోపురంపై ఓ గరుడ పక్షి ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే.
నాలుగు నెలల తర్వాత తాజాగా నేడు గురువారం నాడు మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది. ఈ సారి గరుడ పక్షి పూరీ జగన్నాథుడి ఆలయ గోపురం మీద కూర్చుని ఉంది. పూరీ ఆలయ గోపురంమీద ఉండే జెండా మీద గరుడ పక్షి కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ఇది దైవ సందేశమని కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఏదో ప్రమాదం జరగబోతుందనే దానికి ఇది హెచ్చరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దీన్ని పహల్గాం ఉగ్రదాడితో కనెక్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నార.
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 12 తారీఖున గరుడ పక్షి ఒకటి నోట జెండా పట్టుకుని పూరీ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత సముద్రంవైపు ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. వాస్తవానికి వీడియోలో ఉన్నది గ్రద్ద అని.. దీన్ని గరుడ పక్షిగా భావిస్తారని.. ఇది సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు వాహనం అని.. అలాంటి గరుడ పక్షి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టడం దైవ సంకేతం అని కామెంట్స్ చేశారు.
అయితే ఈ సంఘటన జరిగిన పది రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అమాయకులైన పర్యాటకుల మీద ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు బదులుగా మోదీ సర్కార్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఈ సారి గరుడ పక్షి పూరి ఆలయం శిఖరం మీద కూర్చుని కనిపించడంతో.. ఈసారి ఏ ప్రమాదం జరగబోతుందో అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. గరుడ పక్షి ఆలయ జెండాపై కూర్చొన్న వీడియో ఒడియా మీడియాలో ప్రసారమైంది.
పూరీ ఆలయ గోపురం మీద ఉండే జెండాకు చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఆలయాల మీద ఏర్పాటు చేసిన ఏ జెండా అయినా సరే గాలి దిశనుబట్టి ఎగురుతుంది. కానీ పూరీ ఆలయం మీద ఉన్న జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా కానీ వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. 45 అంతస్తుల ఎత్తున్న ఈ ఆలయంపైకి నిత్యం పూజారి ఎక్కి ఈ జెండాను రోజూ మారుస్తుంటారు. క్రీ.శ. 1800 సంవత్సరం నుంచి ఈ ఆచారం అమల్లో ఉంది. పొరపాటున ఒక్క రోజు జెండా మార్చకపోయినా..18 సంవత్సరాల వరకు ఆలయాన్ని మూసి వేయాలని నమ్ముతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa