సెప్టెంబర్ 3, బుధవారం నాడు జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబ్లలో రెండింటిని అనగా 12, 28 శాతం శ్లాబ్లను తొలగించారు. ఇక మీదట కేవలం 5, 18 శాతం శ్లాబ్లు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల నిత్యవసరాల ధరలు భారీగా దిగి వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తీవ్ర విమర్శలు చేశారు. 8 సంవత్సరాల తర్వాత జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఈక్రమంలో పవన్ ఖేరా జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశంపై స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు గురించి రాహుల్ గాంధీ ఏనాడో చెప్పారని.. ఆయన సలహా పాటించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంత సమయం ఎందుకు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ఎట్టకేలకు.. చివరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారం తగ్గింపు అంశంలో రాహుల్ గాంధీ సలహా పాటించిందని తెలిపారు. దీనితో పాటు గతంలో రాహుల్ గాంధీ జీఎస్టీ అంశంపై చేసిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు.
జీఎస్టీ అంశంపై రాహుల్ గాంధీ గతంలో మాట్లాడుతూ.. పరోక్ష పన్నులు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతాయని తెలిపారు. అందుకే జీఎస్టీ మండలి పన్ను రేటును 18 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచాలని రాహుల్ గాంధీ గతంలోనే కోరారు. దీనివల్ల పేద ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని జీఎస్టీని ఉద్దేశించి గబ్బర్ సింగ్ టాక్స్ అని అనేక సార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి మోదీ ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ విధానాన్ని సరళీకృతం చేస్తామని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులను సవరించారు. దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు ఈ నెల అనగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.
జీఎస్టీ భారం తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వం దిగువ, మధ్యతరగతి జనాలకు భారీ శుభవార్త చెప్పింది. దీపావళి కన్నా ముందే పండగలాంటి వార్త చెప్పి వారికి ఊరట కలిగించింది. కేంద్రం ప్రభుత్వం జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టి.. పన్ను రేట్లను తగ్గించింది. దసరా పండగలోపే కొత్త జీఎస్టీ రేట్లను అమలులోకి తెస్తోంది. జీఎస్టీలో ప్రస్తుతం అమలులో ఉన్న 12, 28 తొలగించి.. 5, 18 శ్లాబులను మాత్రమే కొనసాగించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అయితే జీఎస్టీ భారం తగ్గించి.. సామాన్యులకు ఊరట కల్పించిన ప్రభుత్వం.. కొత్తగా 40 శాతం శ్లాబు ప్రతిపాదించి ప్రీమియం వస్తువుల వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. అయితే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఈ 40 శాతం శ్లాబు సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa