ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సీతమ్మధారలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనపై తీవ్రంగా స్పందించిన వైసీపీ నేత రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 08:48 PM

విశాఖపట్నంలో మతిస్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేత రోజా తీవ్రంగా స్పందించారు. "ఒక మూగ బాలిక‌ను కూడా ర‌క్షించ‌లేని ఈ ప్ర‌భుత్వం ఉన్నా ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే. ఇది మంచి ప్ర‌భుత్వ‌మా రాక్ష‌స ప్ర‌భుత్వ‌మా చంద్రబాబు గారూ విశాఖ‌ప‌ట్నం సీత‌మ్మ‌ధార‌లో మూగ బాలిక‌పై ఇద్ద‌రు అత్యాచారానికి పాల్ప‌డడం మీ అస‌మ‌ర్థ పాల‌న‌కు నిద‌ర్శం కాదా" అంటూ రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa