ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంత ప్రయత్నించినా షుగర్ తగ్గడం లేదా

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 11:04 PM

డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ తగినతం లేకపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఇన్సులిన్ ప్యాంక్రియాస్ (క్లోమం) ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ అనేది జీవక్రియ వ్యాధి. దీనిలో శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా ప్రాసెస్ చేయదు. కానీ సరైన ఆహారం, వ్యాయామం, మందుల సాయంతో దీనిని నియంత్రణలో ఉంచవచ్చు. షుగర్ కంట్రోల్ ఉంచుకోవడానికి న్యూట్రిషనిస్ట్ 10-10-10 రూల్ చెప్పారు.


ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో డయాబెటిస్ ఒక సాధారణ సమస్యగా మారుతుంది. దీనికి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఎలా పడితే అలా తినడం. ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే దానిని వదిలించుకోవడం చాలా కష్టం. కేవలం జీవనశైలిలో మార్పుల ద్వారా మాత్రమే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.


ఇంట్లో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక అలవాట్లను అలవర్చుకోవచ్చు. ఇటీవల ప్రముఖ పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె రక్తంలో చక్కెర స్థాయిని సహజ పద్ధతిలో నియంత్రించగల సులభమైన మార్గాన్ని చెప్పింది. లిమా మహాజన్ 10-10-10 రూల్ గురించి చెప్పారు. ఆ రూల్ ఏంటి, దానిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చుద్దాం. (Photo Credit: Freepik)


డయాబెటిస్‌కి 10-10-10 రూల్


ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్స్ చేయండి


లిమా మహాజన్ ప్రకారం ఎక్కువసేపు కూర్చుని ఉంటే లేదా ఎటువంటి శారీరక శ్రమ చేయకపోతే.. కండరాలు గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. అందుకే శారీరక శ్రమ తప్పనిసరి అంటున్నారు లిమా మహాజైన్. ఇందుకోసం ప్రతి 45 నిమిషాలకు కేవలం 10 స్క్వాట్‌లు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది కాళ్లల్లోని పెద్ద కండరాల్ని సక్రియం చేస్తుంది. ఇవి రక్తం నుంచి చక్కెరను బర్న్ చేసి శక్తిగా ఉపయోగిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగవు. నియంత్రణలో ఉంటాయి.


తిన్న తర్వాత 10 నిమిషాలు నడవండి


పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. తిన్న తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అయితే, తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర దాదాపు 22 mg/dL తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. నడక కండరాలు గ్లూకోజ్‌ను వెంటనే గ్రహించడానికి సాయపడుతుంది. దీంతో, రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఈ అలవాటు కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా నిరోధిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలని లిమా మహాజన్ సూచిస్తున్నారు.


న్యూట్రిషనిస్ట్ ఏం చెప్పారంటే


రాత్రి 10 గంటలకల్లా నిద్రపోండి.


ఎవరికైనా సరే తగినంత నిద్ర ముఖ్యం. డయాబెటిస్ పేషంట్లు తగినంత నిద్రపోవాలి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా పెంచుతుంది. మరోవైపు ప్రతిరోజూ సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. రాత్రంతా చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.


సరైన ఆహారం ముఖ్యం


డయాబెటిస్ పేషంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు.. ఆహారం కూడా పెద్ద పాత్ర పోషిస్తుందని లిమా మహాజన్ అంటున్నారు. తెల్ల రొట్టె లేదా శుద్ధి చేసిన పిండికి దూరంగా ఉండాలని ఆమె చెబుతున్నారు. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్లను తినాలని సిఫార్స్ చేస్తున్నారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని నెమ్మదిగా పెంచుతుంది ఫైబర్. అందుకే ఎక్కువ కూరగాయలు, తొక్కతీసిన పండ్లు, పప్పుధాన్యాలు తినండి. అయితే జ్యూసులు, షుగరీ డ్రింక్, అధిక చక్కెర ఉన్న ఫుడ్స్‌కి దూరంగా ఉండండి.


డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి భారీ మందులు లేదంటే కఠినమైన డైట్ అవసరం లేదని న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ అంటున్నారు. రోజులో కొంచెం వ్యాయామం చేయడం, సకాలంలో నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మార్పు కనిపిస్తుందని చెప్పారు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల్ని భాగం చేసుకోండి. మ్యాగీ, చిప్స్, పాస్తా, మాకరోనీ, పిజ్జాను తీసుకోవడం మానేయండి. ఈ ఆహారాలు వెంటనే డయాబెటిస్‌ను పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఈ ఆహారాల్ని నియంత్రిస్తే.. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa