ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునఃప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర

national |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:35 PM

శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర ఈ రోజు ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం నిలిపివేసిన యాత్రను, వాతావరణం మెరుగుపడటంతో అధికారులు పునరుద్ధరించారు. దీంతో భక్తులు, స్థానిక వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.గురువారం ఉదయం 6 గంటల నుంచే యాత్రకు భక్తులను అనుమతించారు. బేస్ క్యాంప్ నుంచి ఆలయం వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర మండలి అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలను కూడా తిరిగి ప్రారంభించారు. తొలిరోజే 3,500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, ఉదయం నుంచి భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోందని వారు వెల్లడించారు.గతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ యాత్రకు పలుమార్లు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆగస్టు 26న యాత్రను నిలిపివేసిన రోజే, మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపడి 34 మంది యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత 22 రోజుల విరామం అనంతరం నిన్న‌ యాత్రను పునరుద్ధరించినా, వాతావరణం మళ్లీ క్షీణించడంతో వెంటనే నిలిపివేయాల్సి వచ్చింది.ఈ నెల‌ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ఆలయ మండలి అంచనా వేస్తోంది. "యాత్ర పునఃప్రారంభం కావడం మనందరి విశ్వాసానికి, దృఢ సంకల్పానికి నిదర్శనం. భక్తుల భద్రత, సౌకర్యాలకే మా ప్రథమ ప్రాధాన్యత" అని రిజిస్ట్రేషన్ కౌంటర్‌లోని ఓ అధికారి వ్యాఖ్యానించారు. యాత్ర సజావుగా సాగేందుకు భక్తులు అన్ని మార్గదర్శకాలను, వాతావరణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆలయ మండలి విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa