అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును ఏకంగా 100,000 డాలర్లు సుమారు రూ. 83 లక్షలు పెంచుతూ నిన్న ఒక కీలక ప్రకటనపై సంతకం చేశారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం 215 డాలర్లుగా ఉండటం గమనార్హం. దీంతోపాటు, అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం చేసే 'గోల్డ్ కార్డ్' వీసాను కూడా ఆయన ప్రవేశపెట్టారు. దీనికోసం వ్యక్తులు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు కోర్టులో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలపై వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ "అన్ని పెద్ద కంపెనీలు ఈ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాయి. కంపెనీలు ఇకపై అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి. ఒకవేళ అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ను తీసుకురావాలనుకుంటే వారు హెచ్-1బీ వీసా కోసం ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించవచ్చు" అని వివరించారు. ఈ మార్పు వల్ల ఏటా జారీ చేసే 85,000 వీసాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa