మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు కొనసాగుతున్న వేళ, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ (Narayanpur) జిల్లాలో ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి.భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు గట్టి ఎదురుదెబ్బ తిన్నారు. జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
*వికల్ప్ మరణంపై సందేహాలు మృతుల్లో ఒకరు మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన కీలక నేత వికల్ప్ (Vikalp) కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం మావోయిస్టు వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయి ధృవీకరణ కోసం అధికార యంత్రాంగం ప్రయత్నాలు కొనసాగిస్తోందిఅబూజ్మాడ్ అడవుల్లో కాల్పులు అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందడంతో, భద్రతా బలగాలు అక్కడ సోదాలు చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భద్రతా బలగాలు సమాధానంగా కాల్పులు జరపగా, ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.ఏకే-47 సహా ఆయుధాల స్వాధీనం ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. సంఘటనా స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్తో పాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.మావోయిస్టు పార్టీ వారోత్సవాల నడుమే ఒక కీలక నేతను కోల్పోవడం ఆ వర్గానికి పెద్ద షాక్గా మారిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. విలువైన ఇంటెలిజెన్స్ ఆధారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ మావోయిస్టులకు గట్టి దెబ్బగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa